ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించిన డా. గొట్టిపాటి లక్ష్మీ.

0
60

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించిన డా. గొట్టిపాటి లక్ష్మీ.

2025-26 విద్యా సంవత్సరంలో దర్శి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన 24 మంది విద్యార్థులకు బహుమతులు అందజేసే కార్యక్రమం దర్శి పట్టణంలోని శ్రీ వాసవి ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శి టిడిపి ఇన్‌చార్జి డా. గొట్టిపాటి లక్ష్మీ గారు విద్యార్థులను అభినందిస్తూ, విద్యే జీవితంలో శాశ్వత సంపద అని పేర్కొన్నారు.

ప్రథమ బహుమతి – రూ.10,000

ద్వితీయ బహుమతి – రూ.5,000

కీ.శే. కొండేటి నరసింహులు – శ్రీమతి రోశమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు, సినీ నిర్మాత కొండేటి చిన్న నరసింహారావు గారు ఈ బహుమతులను అందజేయడం అభినందనీయమని డా. లక్ష్మీ గారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…

మన జీవితంలో చేసే అత్యుత్తమ పెట్టుబడి విద్య.

విద్యకు మించిన సంపద మరొకటి లేదు.

పేద విద్యార్థుల్లో అపార ప్రతిభ దాగి ఉంది.

ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివి విజయాన్ని సాధించాలి.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
వందమంది మహిళలకు డ్వాక్రా సంఘాలకు కుట్టు మిషన్లు అందజేసిన గద్దె రామ్మోహన్
*మహిళా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఆలోచనలు* *డ్వాక్రాసంఘాలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2026-03-13 12:39:45 0 142
Andhra Pradesh
Pileru: పీలేరు-పులిచర్ల మార్గంలో రెడ్డివారిపల్లి వద్ద పీలేరు ఫారెస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు. రూ. 26 లక్షల ఎర్రచందనం స్వాధీనం, ఐదుగురు స్మగ్లర్ల అరెస్ట్.
Pileru: పీలేరు- పులిచర్ల మార్గమద్యంలో రెడ్డి వారి పల్లి వద్ద 26 లక్షలు విలువ చేసే ఎర్రచందనం అక్రమ...
By Pagadala Venkateswar 2026-07-16 14:09:10 0 36
Andhra Pradesh
నూరు నియోజకవర్గ :సదుంలో పర్యటించిన తంబళ్లపల్లె ఎమ్మెల్యే
పుంగనూరు నియోజకవర్గం, సదుం లో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి శుక్రవారం...
By Kothuru Murali 2026-03-21 06:20:14 0 157
Andhra Pradesh
పోలీస్ శాఖ పరిపాలనలో భాగంగా ఈ ఆఫీస్ పనితీరుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమా మహేశ్వర్ ఐపీఎస్
బాపట్ల: పోలీస్ శాఖ పరిపాలనలో భాగంగా ఈ ఆఫీస్ పనితీరుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన బాపట్ల...
By Gadiyapudi Narendra 2026-01-17 16:48:43 0 262
Telangana
రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేట్స్(REPA) ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి ఎంపీ. ఈటెల.
రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేట్స్ ( REPA ) శంషాబాద్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య...
By Sidhu Maroju 2025-06-29 15:54:28 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com