గ్రంథాలయంలో బాబు జగజీవన్ కు ఘన నివాళి

0
94

నందిగామ జూలై 6 భారత్ అవాజ్ : నందిగామ శాఖ గ్రంథాలయంలో భారత మాజీ ఉపప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబూ జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి అల్లూరు రామచంద్రుడు బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, 1908 ఏప్రిల్ 5న జన్మించిన బాబూ జగ్జీవన్‌రామ్ భారత ఉపప్రధానిగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా విశిష్ట సేవలు అందించారని, కార్మికుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు దళితుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. అందరూ ప్రేమగా "బాబూజీ" అని పిలిచే ఆయన 1986 జూలై 6న పరమపదించారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు గోపాలకృష్ణ, నరేంద్ర, విద్యార్థులు పాల్గొని బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

Search
Categories
Read More
Telangana
సెప్టెంబర్‌లో "బతుకమ్మ" OTT సినిమా
రచయిత మరియు దర్శకుడు గా "బతుకమ్మ "టైటిల్ తో సినిమా త్వరలో చేయబోతున్నట్టు శ్రీను రావు పొన్నాల...
By Ponnala Srinivasrao 2026-04-05 03:11:51 0 281
Andhra Pradesh
బాలలకు విద్యాశీస్సు... తల్లికి వందనంతో ఉషస్సు!
బాలలకు విద్యాశీస్సు... తల్లికి వందనంతో ఉషస్సు! విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ, తల్లుల...
By Chennaiah Kati 2026-06-18 08:55:03 0 75
Andhra Pradesh
గుడివాడ బైపాస్ రోడ్ నిర్మాణం పనులు చేపట్టినMLA వెనిగండ్ల రాము గారు
*గుడివాడ ప్రజల భావోద్వేగ సమస్యలలో ఒకటైన... బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తున్నాం:ఎమ్మెల్యే...
By Rajini Kumari 2025-12-28 09:56:25 0 171
Andhra Pradesh
మధ్యాహ్న భోజనం ఆకస్మిక తనిఖీ గద్దె అనురాధ
*గాంధీజీ స్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకంపై ఆకస్మిక తనిఖీ*   *విద్యార్థులతో కలిసి భోజనం...
By Rajini Kumari 2026-03-24 11:36:57 1 186
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం – ప్రతి ఫిర్యాదుకు న్యాయం జరిగేలా చర్యలు: జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్
ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం – ప్రతి ఫిర్యాదుకు న్యాయం జరిగేలా చర్యలు: జిల్లా ఎస్పీ శ్రీ...
By Chennaiah Kati 2026-07-13 16:15:37 0 54
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com