విద్యార్థులు మొబైల్ ని వీడి చదువుపై దృష్టి సారించాలి

0
366

గూడూరు జెడ్‌పీ సెకండరీ బాలికల పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమం 

-  షీ టీం ఎస్‌ఐ కుమారి సునంద గారు, గూడూరు పోలీస్ స్టేషన్ SHO గిరిధర్ రెడ్డి గారితో సంయుక్తంగా విద్యార్థినులకు సైబర్ భద్రత, భరోసా సేవలు, మైనర్ డ్రైవింగ్, డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన

మహబూబాబాద్ ::గూడూరు మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాల, గూడూరులో బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమమును మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ డాక్టర్ పి శబరీష్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో షీ టీం ఎస్‌ఐ కుమారి సునంద గారు మరియు గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గిరిధర్ రెడ్డి గారు సంయుక్తంగా పాల్గొని విద్యార్థినులకు షీ టీం సేవలు, భరోసా కేంద్రం అందిస్తున్న సేవలు, వాటి ప్రాముఖ్యత, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, మత్తు పదార్థాలు మరియు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ శాఖ సేవలను వినియోగించుకోవాలని, ఏవైనా వేధింపులు లేదా నేరాలు ఎదురైన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మహబూబాబాద్ షీ టీం నెంబర్8712656935, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100/112, సైబర్ మోసాల ఫిర్యాదుల కోసం1930 హెల్ప్ లైన్ నెంబర్లను వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థినులు చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించి సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాల హెడ్మాస్టర్ సుజాత మేడం, జిల్లా పరిషత్ సెకండరీ బాలుర పాఠశాల హెడ్మాస్టర్ సత్యనారాయణ సార్ మరియు అధ్యాపక బృందం 300 మంది విద్యార్థిని విద్యార్థులు, షీ టీం సిబ్బంది రమేష్ ,పార్వతి, భరోసా సిబ్బంది జోష్ణ పార్వతి తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
వైద్యాధికారుల పనితీరుపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆగ్రహం.
నిమ్మనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారుల పనితీరుపై ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా...
By Pagadala Venkateswar 2026-05-12 06:08:40 0 96
Telangana
కార్పొరేషన్ సమీక్ష సమావేశం లో పాల్గొన్న మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15 వ డివిజన్ లో ఏర్పాటు చేసిన డివిజన్ సమీక్షా సమావేశంలో...
By Avunoori Mahesh 2026-04-25 07:42:53 0 126
Andhra Pradesh
జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా. డీఎస్ఓ ను వెంటనే సస్పెండ్ చేయాలి - బీఎస్పీ డాక్టర్ గుదే రాజారావు డిమాండ్.
బాపట్ల బాపట్ల జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని, దీనికి...
By Vadlamudi NagaVenkat 2026-04-10 09:59:39 0 142
Andhra Pradesh
ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్ల మోసాలు : కర్నూలు ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లా :ప్రభుత్వ పథకాల పేరుతో  సైబర్‌ నేరగాళ్ల మోసాలు...సైబర్ నేరాల...
By Hari Krishna 2026-01-16 12:08:45 0 187
Andhra Pradesh
క్రిస్మస్‌ సందర్భంగా చీరాల మాజీ శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి గారు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కరణం వెంకటేష్ బాబు గారు  శుభాకాంక్షలు తెలిపారు.
క్రిస్మస్‌ సందర్భంగా చీరాల మాజీ శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి గారు మరియు వైఎస్సార్...
By Gadiyapudi Narendra 2025-12-24 17:27:23 0 254
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com