రైతుల కష్టాలు తీర్చిన ‘ముసలమ్మ ట్రస్ట్’ చొరవ!

0
275

మహబూబాబాద్:::గంగారం మండల పరిధిలోని కోడిసెలమిట్ట పందెం గ్రామపంచాయతీ చెరువు కాలువలో గత కొంతకాలంగా మట్టి, ఇసుక పేరుకుపోవడంతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. నీరు సరిగా వెళ్లకపోవడంతో ఆయకట్టు దిగువ  పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ట్రస్ట్ బోర్డ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన గుంజేడు ముసలమ్మ ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ పుల్సం సురేష్ తన సొంత ఖర్చులతో JCB యంత్రాలను రప్పించి కాలువలో పేరుకుపోయిన మట్టిని తొలగించే పనులను చేపట్టారు. ఈ సందర్భంగా పుల్సం సురేష్ మాట్లాడుతూ, మంత్రి సీతక్క  ఆదేశాల మేరకు "రైతు సమస్య అంటే అది ప్రజా పాలన ప్రభుత్వ సమస్య. ప్రభుత్వం నిధులు విడుదల చేసేలోపు పంట దెబ్బతింటుంది. అందుకే సీతక్క ఆదేశాల మేరకు ముందుగా మేమే ముందుకు వచ్చి కాలువలను శుభ్రం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని కాలువల్లో కూడా పూడిక తొలగిస్తాం" అని తెలిపారు.

రైతుల హర్షం
  
ట్రస్ట్ బోర్డ్ చొరవను స్థానిక రైతులు అభినందించారు. "ముసలమ్మ ట్రస్ట్, సురేష్ అన్న లేకపోతే మా పంటలు నష్టపోయేవి. ఇప్పుడు కాలువ క్లీన్ కావడంతో నీరు సాఫీగా పొలాలకు వెళ్తుంది" అని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎనిమిదో వార్డ్ మెంబర్ గుంట అరుణ సూర్యం, నర్సింగరావు, బుచ్చి రాములు, పవన్ సభ్యులు, గ్రామ పెద్దలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బిల్ గేట్స్ గారికి సాదర స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ
కృష్ణాజిల్లా పోలీస్    *బిల్ గేట్స్ గారికి సాదర స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ శ్రీ...
By Rajini Kumari 2026-02-16 08:00:57 0 211
Andhra Pradesh
శారీరక దృఢత్వం సంపూర్ణ ఆరోగ్యానికి సైక్లింగ్
శారీరక దృఢత్వం..సంపూర్ణ ఆరోగ్యానికి సైక్లింగ్ జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్...
By Chennaiah Kati 2026-06-28 04:16:12 0 59
Business & Finance
FSSAI Certification Ensures Safe Food Business Growth
FSSAI Certification is essential for food businesses involved in manufacturing, processing,...
By Navya Sree 2026-07-24 05:29:40 0 20
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: మదనపల్లెలోభారీ వర్షం.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి....
By Pagadala Venkateswar 2026-06-12 14:21:58 0 85
Andhra Pradesh
పుంగనూరు: క్షుద్ర పూజల కలకలంతో పాఠశాలకు వెళ్ళని విద్యార్థులు.
చౌడేపల్లి మండలం, కాగతి గ్రామంలో మౌని అమావాస్య రోజున పాఠశాల ఆవరణంలో గుర్తుతెలియని వ్యక్తులు...
By Kothuru Murali 2026-01-30 04:47:34 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com