అడవిలో చావు బతుకు మధ్య దొరికిన "అపరంజి" ఉపిరి పోసిన చింతూరు వైద్యులు!"
కన్నప్రేమ కరువైందో.. లేక ఆడపిల్ల అనే అనాగరికపు ఆలోచనో తెలీదు కానీ, పురిట్లోనే ఆ పసికందును అడవి పాలు చేశారు. శీతాకాలపు చలిలో, క్రూర జంతువుల మధ్య చింతూరు మండలం మదుగూరు గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఒంటరిగా విడిచిపెట్టబడిన ఆ నవజాత ఆడ శిశువును అదృష్టవశాత్తూ జనవరి 19న ఆశా కార్యకర్తలు గుర్తించారు. వెంటనే స్పందించి ఆమెను చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తెచ్చే సమయానికి ఆ పసికందు పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. అయితే, అక్కడి వైద్య బృందం ఆ పాపను కాపాడడమే లక్ష్యంగా పెట్టుకుంది. సూపరిడెంట్ ఏం,వి. డాక్టర్ కోటిరెడ్డి, డాక్టర్ మహేష్ ఆ శిశువుకు అత్యవసర చికిత్స అందించారు. క్షణాల మీద పోరాడి, ఆ చిన్నారికి ఊపిరి పోసి ప్రాణాలు కాపాడారు. వైద్యుల నిరంతర కృషితో ఆ పాప పూర్తిగా కోలుకుంది. ప్రస్తుతం క్షేమంగా ఉన్న ఆ చిన్నారిని తదుపరి సంరక్షణ కోసం ఐసీడీఎస్ (ICDS) అధికారుల ద్వారా పాడేరులోని ‘శిశు గృహ’కు సురక్షితంగా తరలించారు. అడవిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడిన పాపకు పునర్జన్మ ప్రసాదించిన చింతూరు ప్రభుత్వ వైద్యులను, ఆశా కార్యకర్తలను స్థానికులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.
# Yadagiri
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz