వక్ఫ్ సమస్య పరిష్కారానికి చర్యలు వేగవంతం.|

0
61

"ప్రభావిత కాలనీలకు త్వరలో ఊరట లభించే సూచనలు"

మేడ్చల్ మల్కాజిగిరి జూలై 4: మల్కాజ్‌గిరి నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వక్ఫ్ బోర్డు సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మరో కీలక అడుగు వేశారు. 

శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్, తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ ఆసుదుల్లాను కలిసి సమస్య తీవ్రతను వివరించి, తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ సందర్భంగా 2024లో వక్ఫ్ బోర్డు పొరపాటున మల్కాజ్‌గిరి పరిధిలోని సర్వే నంబర్లు 3, 103, 104, 105, 144 నుంచి 154 వరకు 22-ఏ నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చడంతో న్యూ విద్యానగర్, ఓల్డ్ నేరెడ్మెట్, రాంబ్రహ్మనగర్, దేవినగర్ ఎక్స్‌టెన్షన్, దేవినగర్, సైనిక్ నగర్, సీతారాం నగర్, కృష్ణా నగర్ తదితర ప్రాంతాల్లో ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఎమ్మెల్యే వివరించారు.

ఆంధ్రప్రదేశ్ గెజెట్ నం.35 పార్ట్-2 (27-08-1987), గెజెట్ నం.37 పార్ట్-2 (13-10-2001), అలాగే హైకోర్టు సి.ఆర్.పీ. నం.5057/2008 తీర్పు ప్రకారం సంబంధిత సర్వే నంబర్లు మల్కాజ్‌గిరికి కాకుండా ఉప్పల్ మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందినవని మంత్రి, వక్ఫ్ బోర్డు సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు.

కాలనీ సంక్షేమ సంఘాల విజ్ఞప్తి మేరకు ఇప్పటికే పలుమార్లు వక్ఫ్ బోర్డు చైర్మన్, సీఈఓలను కలిసి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు తన ప్రయత్నాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

దీనిపై మంత్రి మహ్మద్ అజారుద్దీన్, వక్ఫ్ బోర్డు సీఈఓ ఆసుదుల్లా సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. 

మల్లాపూర్ గ్రామానికి చెందిన సర్వే నంబర్లు పొరపాటున మల్కాజ్‌గిరి పరిధిలోని వక్ఫ్ జాబితాలో నమోదైనట్లు ప్రాథమికంగా గుర్తించామని, వాటిని జాబితా నుంచి తొలగించేందుకు అవసరమైన చర్యలను అత్యవసరంగా చేపడుతున్నట్లు అధికారులు తెలిపారని అన్నారు.

ఈ అంశంపై ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కూడా చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని, సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ప్రభావిత కాలనీవాసులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మల్కాజ్‌గిరి ప్రజల హక్కులు, వారి ఆస్తుల రక్షణ కోసం తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Business & Finance
Respond to Trademark Objections with Expert Support
A trademark objection is raised by the Trademark Registry when an application requires...
By Navya Sree 2026-07-14 06:24:31 0 59
Telangana
యూసుఫ్ నగర్ స్మశానవాటిక అభివృద్ధి, ఉర్దూ మెడికల్ స్కూల్ ఏర్పాటుపై మంత్రిని కలిసిన ఎమ్మెల్యే మాధవరం
హైదరాబాద్, జూన్ 19: భారత్ ఆవాజ్ ప్రతినిధి,  అల్లాపూర్ డివిజన్ పరిధిలోని యూసుఫ్ నగర్ ముస్లిం...
By Jagadeesh Babu 2026-06-19 15:14:34 0 140
Andhra Pradesh
కడప విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.
కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్ విమానాశ్రయంలో లోకేష్‌కు ఘన...
By Pagadala Venkateswar 2026-05-22 05:17:59 0 89
Business & Finance
Collateral-Free Loans Make Business Funding Easier
Collateral-free loans provide businesses with access to funds without requiring property or other...
By Navya Sree 2026-07-20 05:59:18 0 24
Andhra Pradesh
పశ్చిమగోదావరి జిల్లా డివైడర్ను ఢీ కొట్టి నా బైక్ ప్రమాదంలో ముగ్గురు మృతి
పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. పెనుమంట్ర మండలం పోలమూరు వద్ద ఓవర్ స్పీడ్ తో...
By Rajini Kumari 2025-12-23 10:04:04 0 418
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com