కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించక పోవడం వల్ల సమస్యలు ఉత్పన్నం. ఎమ్మెల్యే శ్రీ గణేష్.

0
2K

కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడం వల్ల కాలనీలలో చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. ఈరోజు వార్డు 5 జ్యోతి కాలనీ రోడ్ నెంబర్ 2 లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాలనీ వాసులతో కలిసి పర్యటించారు. కాలనీవాసులు తమకు కనీస అవసరాలు అయిన చెత్త సేకరణ, నీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, భూగర్భ డ్రైనేజీ సక్రమంగా లేకపోవడం తదితర పనులను బోర్డు పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులను పిలిపించుకుని వారి సమస్యలను వివరించి త్వరగా వీటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.అనంతరం కాలనీ వాసులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ బోర్డు ఎన్నికలు నిర్వహించకపోవడం వలన ఇలాంటి చిన్న చిన్న పనులను కూడా ఎమ్మెల్యే పట్టించుకోవలసి వస్తుందని, అదే బోర్డు ఎన్నికలు నిర్వహించినట్లయితే ప్రతి వార్డుకు ఒక ప్రజా ప్రతినిధి ఉంటాడని, అతను ఇలాంటి చిన్న చిన్న సమస్యలను బోర్డు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని, గతంలో ఇక్కడ వార్డు సభ్యులుగా, నామినేటెడ్ సభ్యులుగా పని చేసిన వారు పదవులపై ఉన్న శ్రద్ధను ప్రజలకు సేవ చేయడంలో చూపించలేదని, అందుకే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, ఇప్పటికైనా ప్రజలు కూడా ఆలోచించుకుని వారికి అందుబాటులో ఉండే వారిని ఎన్నికలలో ఎన్నుకుంటే ఈ సమస్యలు ఉండవని, నేను నిత్యం అందుబాటులో ఉంటానని, అలాగే బోర్డు ఎన్నికలు నిర్వహించినట్లయితే సమర్ధులకు, నిత్యం అందుబాటులో ఉండే వారికి ఓట్లు వేసి గెలిపించుకోవాలని కాలనీ వాసులకు సూచించారు.

Like
1
Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
ఈరోజు TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని మంచిర్యాల జిల్లా నాయకులు కొరకొప్పుల మహేష్...
By Sadaq Sadaq 2026-05-16 17:05:17 0 94
Telangana
"డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు? – కాలనీవాసుల ప్రశ్నలు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని బొల్లారం సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్-14లో...
By Sidhu Maroju 2026-06-06 06:25:57 0 274
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో చలో విజయవాడ పోస్టర్లు ఆవిష్కరణ
పుంగనూరులోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ భవనంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో గురువారం చలో విజయవాడ...
By Kothuru Murali 2026-02-26 12:57:29 0 140
Andhra Pradesh
డ్రంకెన్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలుశిక్ష
డ్రంకెన్ డ్రైవ్ కేసులో బొబ్బిలి మండలం జగన్నాథపురానికి చెందిన వ్యక్తికి మూడు రోజులు జైలుశిక్ష...
By Boiena Rajesh 2026-07-23 08:08:14 0 30
Telangana
కరీంనగర్ తెలంగాణ చౌక్ బస్టాప్ షేడ్స్ నిరుపయోగం.
కరీంనగర్ జిల్లా.  కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ...
By Thalakokkula Sadanandam 2026-03-19 23:00:39 0 501
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com