ఎన్నికలు పకడ్బందీగా ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పని చేయాలి

0
275

జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్,

 

మహబూబాబాద్ జిల్లా, డిసెంబర్ 13: గ్రామపంచాయతీ ఎన్నికలు -25, సందర్భంగా జిల్లాలో రెండవ, మూడవ విడతలలో జరగబోయే ఎన్నికలను పకడ్బందీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల కమిషనర్ సూచనల మేరకు అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పని చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. శనివారం అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో రెవెన్యూ, కె.అనిల్ కుమార్, సంబంధిత ఎన్నికల విభాగం అధికారులతో ఆయన రెండు, మూడవ విడత ఎన్నికల నిర్వహణపై కలెక్టరేట్ ఎన్ఐసి సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో ఐదు మండలాలలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని, రేపు జరగబోయే రెండవ విడత ఎన్నికలు అదేవిధంగా ఎన్నికల సంఘం సూచించిన ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఎన్నికల సామాగ్రిని బ్యాలెట్ బాక్స్ లను పంపిణీ చేయడం జరిగిందని ప్రతి ఒక్కరూ వారికి సూచించిన ప్రకారం విధులు జాగ్రత్తగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. 17వ తేదీన మూడవ విడత ఎన్నికల జరిగే మండలాలు (6) డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సిరోలు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిస్ట్రిబ్యూషన్ , రిసెప్షన్ సెంటర్లలో భోజన వసతి,త్రాగునీరు, చైర్స్, టెంట్స్, రవాణా సదుపాయం, వైద్య శిబిరాలు, తదితర తగిన ఏర్పాట్లు చేయాలని, ముందస్తు సమాచారం అందిస్తూ ఎన్నికల సిబ్బందికి తగిన సూచనలు జారీ చేయాలని సూచించారు, పోలింగ్ బ్యాలెట్ బాక్సులు సామాగ్రి, పోలింగ్ ముందు రోజు పోలింగ్ తర్వాత భద్రత మధ్య సంబంధిత రిసెప్షన్ సెంటర్లకు తరలించాలని.. పూర్తిగా పారదర్శకంగా ఎన్నికల కమిషన్ సూచించిన ప్రకారం జిల్లాలో పకడ్బందీగా ఎన్నికల నిర్వహించాలని తెలిపారు, ఎన్నికలు జరిగే ప్రదేశాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని, ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అందించాలని సూచించారు. పూర్తి స్థాయిలో అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేసే ఎన్నికల విజయవంతనికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పి సీఈవో పురుషోత్తం, డిపిఓ హరిప్రసాద్, ప్రత్యేక అధికారులు,ఆరు మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్ దంప‌తులు.
స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన లోకేశ్‌ శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని...
By Pagadala Venkateswar 2026-03-03 09:39:07 0 95
Telangana
భారీగా తగ్గిన చికెన్ ధరలు
గత వారంతో పోలిస్తే ఇవాళ చికెన్ ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ లో నిన్న మొన్నటి వరకు కేజీ స్కిన్...
By Prashanth Goindla 2026-03-29 02:00:39 0 78
Andhra Pradesh
సూళ్లూరుపేట లో వైయస్ షర్మిల రెడ్డి రచ్చబండ
Breaking    సూళ్లూరుపేట @ తిరుపతి జిల్లా    సూళ్లూరుపేట నియోజక వర్గం...
By Rajini Kumari 2026-02-07 12:10:13 0 108
Andhra Pradesh
ఐ.ఎం.ఏ రాష్ట్రశాఖ* *ఉత్తమఅధ్యక్షుని జాతీయ* *అవార్డు* *అందుకున్న డాక్టర్ జి.* *నందకిషోర్*
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ .ఎం .ఎ)ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఇచ్చే ఉత్తమ రాష్ట్ర అధ్యక్షుని...
By John Baji 2025-12-30 01:38:48 0 129
Health & Fitness
COVID-19 Cases Rising in Asia: What’s Causing the Surge and What Should We Do? Doctors Explain New Symptoms
COVID-19 Cases Rising in Asia: What’s Causing the Surge and What Should We Do? Doctors...
By BMA ADMIN 2025-05-21 09:57:11 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com