హైడ్రా కమిషనర్‌కు ఎమ్మెల్యే మర్రి కీలక వినతులు.|

0
58

"ప్రభుత్వ భూముల పరిరక్షణ, పేదలకు న్యాయం చేయాలని వినతి"

మేడ్చల్ మల్కాజ్ గిరి : మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా అల్వాల్‌లో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించిన గ్రామకంఠం భూమిపై కొనసాగుతున్న కోర్టు స్టే అంశాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. 

ప్రజల భద్రత దృష్ట్యా ఫైర్ స్టేషన్ నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అదే గ్రామకంఠం ప్రాంతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసిన అధికారులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అల్వాల్ జొన్నబండ పరిధిలోని యూఎల్సీ భూములు, సర్వే నంబర్లు 582, 583లో 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. 

అదే ప్రాంతంలో నివసిస్తున్న వడ్డెర, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పేద కుటుంబాలకు జారీ అవుతున్న నోటీసుల అంశాన్ని కూడా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, నిరుపేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మల్కాజ్‌గిరి నియోజకవర్గ ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అభివృద్ధి పనుల వేగవంతమైన అమలే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తూ కృషి కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే సమర్పించిన వినతులపై హైడ్రా కమిషనర్ సానుకూలంగా స్పందించి, సంబంధిత అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
KL యూనివర్సిటీ మొదటి విడత ఇంజనీరింగ్ పరీక్ష ఫలితాలు విడుదల
*కె ఎల్ యూనివర్సిటీ మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.* ఆడపిల్లకు చదువే అసలైన...
By Rajini Kumari 2026-01-10 12:42:30 0 174
Andhra Pradesh
మినీ అంగన్‌వాడీలకు పదోన్నతి: 39 మందికి ఉత్తర్వుల పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే ముత్తుముల.
కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ...
By John Baji 2026-01-03 02:11:09 0 220
Andhra Pradesh
పుంగనూరు: గ్రహణం కారణంగా ఆలయం మూసివేత
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో చంద్రగ్రహణం కారణంగా మంగళవారం...
By Kothuru Murali 2026-03-02 04:16:03 0 140
Business & Finance
Footpath Drive Affects Bengaluru Street Businesses
Bengaluru's ongoing footpath clearance drive has improved pedestrian movement and reduced...
By Navya Sree 2026-07-03 07:19:45 0 46
Andhra Pradesh
మహిళల ప్రో కబడ్డీ ఆదర్శనీయం
*చీరాల రోటరీ క్లబ్ ఇండోర్ స్టేడియం లో జరిగే ఉమెన్స్ ప్రో కబడ్డీ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవం చేసిన...
By Vadlamudi NagaVenkat 2026-06-11 11:34:00 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com