గ్రామీణ జర్నలిస్టులకు అండగా TUWJ(IJU)

0
587

  గంగారంలో భారీగా సభ్యత్వ నమోదు                                                                                                       
మహబూబాబాద్/గంగారం,::: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) – ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం బుధవారం ఉత్సాహంగా ప్రారంభమైంది. మండలంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి TUWJ సభ్యత్వం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి TUWJ వేదిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి TUWJ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గాడిపెళ్లి శ్రీహరి, స్టేట్ కౌన్సిలు సభ్యులు శ్రీనివాస్  హాజరై సభ్యత్వ నమోదును ప్రారంభించారు. "జర్నలిస్టుల హక్కుల కోసం, సంక్షేమం కోసం TUWJ నిరంతరం పోరాడుతుంది. ఐజేయూ దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద జర్నలిస్టు సంఘం. దీని ద్వారా మన గొంతు ఢిల్లీ వరకు వినిపిస్తుంది" అని వారు పేర్కొన్నారు. మండల జర్నలిస్టులు మాట్లాడుతూ, "మారుమూల మండలమైన మాకు ఒక బలమైన యూనియన్ అండ అవసరం. అక్రిడిటేషన్, హెల్త్ కార్డు, ఇన్సూరెన్స్, వేధింపుల నుండి రక్షణ వంటి సమస్యలపై TUWJ అండగా నిలుస్తుందనే నమ్మకంతో సభ్యత్వం తీసుకుంటున్నాం" అని తెలిపారు. మండలంలో 100% అర్హులైన జర్నలిస్టులను TUWJలో చేర్పించడమే లక్ష్యమని TUWJ మండల అధ్యక్షులు బుర్కా యాదగిరి అన్నగారు తెలిపారు. త్వరలో సభ్యత్వం నమోదు కంప్లీట్ చేసి  సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. "జర్నలిస్టుపై దాడి జరిగితే అది ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తాం. ప్రతి సభ్యుడికి TUWJ అండగా ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి జర్నలిస్టుకు అందేలా చూస్తాం" అని జిల్లా నాయకులు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో IJU సహాయ కార్యదర్శి రావుల ప్రశాంత్, గూడూరు,  కొత్తగూడ, యాకంబ్రం, సల్మాన్, వెంకటేష్, కర్ణాకర్ రెడ్డి, అశోక్, భరత్, దేవేందర్, శ్రీధర్, సంతోష్, శేఖర్, రవీందర్, ఎస్కే లతీఫ్, భార్గవ్, సురేష్, ముత్తయ్య,
తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల SIR కార్యక్రమం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని 48, 49, 50, 51, 54, 55, 56, 57, 58, 59, 60 వార్డులలో...
By Kothuru Murali 2026-06-17 16:30:21 0 97
Andhra Pradesh
Chandrababu Naidu: కేంద్ర నిధులపై సీఎం చంద్రబాబు ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.
కేంద్ర బడ్జెట్ 2026-27లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు, ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-02-13 06:53:52 0 145
Andhra Pradesh
ఏపీలో త్వరలో పురపాలక ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు
*ఏపీలో త్వరలో పురపాలక ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు!*    అమరావతి :   ఏపీ...
By Rajini Kumari 2026-04-13 08:29:53 0 137
Chandigarh
Chandigarh Enhances Housing and Civic Amenities in 2026
Chandigarh continues to strengthen its urban infrastructure by improving housing facilities and...
By Fathima Safa 2026-07-02 05:58:30 0 31
Andhra Pradesh
శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ ఏర్పాట్ల పరిశీలన చేసిన MLA
ఈ నెల 20వ తేదీన మదనపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో, చిత్తూరు బస్టాండ్ వద్ద...
By Pagadala Venkateswar 2026-06-13 11:06:55 0 75
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com