Chandrababu Naidu: అమరావతిలో మొదటిసారిగా రిపబ్లిక్ డే వేడుకలు... సీఎం చంద్రబాబు స్పందన.

0
303

అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు జరగడంపై సీఎం చంద్రబాబు హర్షం

ఈ రిపబ్లిక్ డే ఏపీ ప్రజలకు చిరస్మరణీయమని వ్యాఖ్య

 

ప్రభుత్వ ఎజెండాను వివరించిన గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపిన సీఎం

పరేడ్, శకటాల ప్రదర్శన భవిష్యత్ ఆకాంక్షలకు అద్దం పట్టాయన్న చంద్రబాబు

ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణమని, చిరకాలం గుర్తుండిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

ఈ చారిత్రక సందర్భంపై చంద్రబాబు సోమవారం స్పందిస్తూ.. అమరావతిలో మువ్వన్నెల జెండాను ఎగురవేయడం ఆనందంగా ఉందన్నారు. వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ఎజెండాను, భవిష్యత్ కార్యాచరణను గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ స్పష్టంగా వివరించారని, ఇందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని ట్వీట్ చేశారు.

 

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన గ్రాండ్ పరేడ్, అందంగా తీర్చిదిద్దిన శకటాల ప్రదర్శన మన సమష్టి ఆశయాలకు, భవిష్యత్ దృష్టికి అద్దం పట్టాయని చంద్రబాబు ప్రశంసించారు. ఈ వేడుకలను వీక్షించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొంటూ ‘జై హింద్’ అని తన ప్రకటనను ముగించారు.

Search
Categories
Read More
Telangana
CMRF ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో చెక్కు అందజేత
చిలుకూరు గ్రామానికి చెందిన గండు సావిత్రి భర్త వెంకట్ నారాయణ గారికి కోదాడ శాసన సభ్యురాలు శ్రీమతి...
By Nookapangu Manikanta 2026-04-19 05:33:11 0 191
Andhra Pradesh
దళిత ద్రోహి మాజీ సీఎం జగన్ వర్ల రామయ్య కామెంట్స్
*మంగళగిరి,* *తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం,* *ది : 23-02-2026.*   *దళిత ద్రోహి జగన్...
By Rajini Kumari 2026-02-23 12:03:54 0 166
Andhra Pradesh
Ambati Rambabu: అంబటి రాంబాబుకు జగన్ ఫోన్‌... పార్టీ మొత్తం అండగా ఉంటుందని భరోసా.
అంబటిని ఫోన్‌లో పరామర్శించిన జగన్ రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని తీవ్ర విమర్శ  ...
By Pagadala Venkateswar 2026-02-01 08:45:55 0 148
Telangana
పెద్దపల్లి : కరీంనగర్ భార్య వేధింపులు భర్త సూసైడ్...!
భార్యా మానసికంగా వేధింపులు తట్టుకోలేక కరీంనగర్ చెందిన కళ్యాణo రాకేష్ (27) ఉరి వేసుకునే ఆత్మహత్యకు...
By Sunka Santhosh 2026-07-07 17:23:52 0 105
Telangana
తెలంగాణలో ఐదు రోజులపాటు వర్షాలు.....
50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు తగ్గిన ఎండ తీవ్రత... 43 డిగ్రీలకు దిగొచ్చిన టెంపరేచర్లు.....
By Gujile Ramu 2026-05-07 02:11:24 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com