నా బంగారు పొలం నాకు ఇవ్వాలని ఫిర్యాదు

0
111

వరంగల్ /చెన్నారావుపేట::::: చెన్నారావుపేట మండలం కోపాకులపాడులోని ఆరెకరాల భూమి.. తమకు కౌలుకు ఇవ్వాలంటే తమకు ఇవ్వాలంటూ యజమానిని పలువురు సంప్రదిస్తున్నారు. ఇంత డిమాండ్ ఎందుకు? ఆ భూమిలో బంగారం ఏమైనా పండుతుందా అంటే అవుననే అంటున్నారు గ్రామస్థులు. ఈ భూమిని పదేళ్ల క్రితం చెన్నారావుపేటకి చెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేశారు. ఈర్యతండాకు చెందిన రైతు దీన్ని కౌలుకు తీసుకొని ఏడాది పత్తి సాగు చేస్తున్నారు. ఈ నెల 24న కలుపు తీయిస్తుండగా మహిళా కూలీలకు కౌలుకు తీసుకొని ఏడాది పత్తి సాగు చేస్తున్నారు. ఈ నెల 24న కలుపు తీయిస్తుండగా మహిళా కూలీలకు బంగారు ఆభరణాలు దొరికినట్లు ప్రచారం జరిగింది. విషయం తెలుసుకున్న యజమాని కూలీలను పిలిచి విచారించగా దొరికిన బంగారు వస్తువులను చూపించారు. దీనిపై యజమాని ఠాణాలో ఫిర్యాదు చేశారు.

ఈ ప్రాంతంలో పూర్వం ఆలయాలున్నాయని.. 1991లో అప్పటి భూ యజమానికి కూడా కొంత బంగారం దొరికిందని, తర్వాత కొన్నేళ్లకు పొలంలో జీతం ఉన్న వ్యక్తికి కూడా దొరికిందని గ్రామస్థులు చెబుతున్నారు. గతంలో ఈ ప్రాంతంలో దేవతామూర్తుల విగ్రహాలు లభించాయన్నారు. దొరికిన బంగారాన్ని పంచుకున్న వ్యక్తులపై చర్యలు తీసుకొని దాన్ని తమకు అందించి న్యాయం చేయాలని తొలుత భూమి విక్రయించిన వ్యక్తి కుమారుడు సోమవారం ఠాణాలో ఫిర్యాదు చేశారు. మరోవైపు కనకం దొరికినట్లు జరుగుతున్న ప్రచారంతో రాత్రి సమయంలో భూమిలో చుట్టు పక్కల గ్రామాల వారు సంచరిస్తున్నారు.

Search
Categories
Read More
SURAKSHA
. Blood Donation: Police Save Lives Voluntarily
Tamil Nadu Police organizes blood donation camps regularly across districts. Officers donate...
By Kalaga Sailaja 2026-07-02 05:36:03 0 77
Lakshdweep
Lakshadweep Advances Clean Energy and Green Infrastructure
Lakshadweep continues to promote clean energy and green infrastructure in 2026 by expanding...
By Fathima Safa 2026-07-04 13:09:36 0 80
Andhra Pradesh
మీభూమి మీ హక్కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
*ఆత్మకూరు, జనవరి 5:*   *అధికారం చేపట్టిన వెంటనే రైతుల హక్కులు హరించే ల్యాండ్ టైటిలింగ్...
By Rajini Kumari 2026-01-05 11:49:53 0 217
Telangana
డ్రైవర్ ఆత్మహత్య..కుటుంబానికి 10 లక్షలు, ఉద్యోగం
తెలంగాణ : పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న RTC డ్రైవర్  శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం...
By Sunka Santhosh 2026-04-24 15:00:01 0 204
Andhra Pradesh
చింతూరులో 'స్వచ్ఛ రథం' ప్రారంభం ప్లాస్టిక్ ఇస్తే నిత్యావసరాలు పంపిణీ!
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా చింతూరు మండలంలో ఒక వినూత్న కార్యక్రమం మొదలైంది. ప్లాస్టిక్ వ్యర్థాల...
By Shyamala Yadagiri 2026-05-09 03:40:35 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com