ఓటరు నమోదు వేగవంతం.|

0
114

"బౌరంపేట్‌లో ప్రత్యేక ఓటరు సవరణ (SIR) కార్యక్రమాన్ని పరిశీలించిన కొలన్ హన్మంత్ రెడ్డి."

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 295వ డివిజన్ బౌరంపేట్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (Special Intensive Revision - SIR) ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి బూత్ లెవెల్ అధికారులతో (BLOలు) కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు నమోదు ప్రక్రియను బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ఓటరు జాబితాలో ఖచ్చితత్వం ఉండేలా అవసరమైన వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలు బీఎల్ఓలు అందించే ఎన్యుమరేషన్ ఫారమ్‌లను సక్రమంగా నింపి సమర్పించాలని, ముఖ్యంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్న కొలన్ హన్మంత్ రెడ్డి, ప్రతి ఒక్కరూ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
Anna Canteen: పేదలకు శుభవార్త.. ఇక గ్రామాల్లో అన్న క్యాంటీన్లు.. సంక్రాంతి నుంచి ప్రారంభం
Anna Canteen: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో అన్న క్యాంటీన్లు...
By Siva Bhaskar 2025-12-25 02:22:39 1 758
Telangana
కరీంనగర్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
కరీంనగర్ కమిషనర్ పరిధిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన మొమ్మద్ అబ్దుల్ వాజిద్ గత పదివేలుగా...
By Sunka Santhosh 2026-06-01 17:47:23 0 103
Telangana
నన్ను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదు.. సీఎంకు కిషన్ రెడ్డి కౌంటర్!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర...
By Ponnala Srinivasrao 2026-06-08 03:06:41 0 134
Business & Finance
June GST Growth Supports Arunachal's Development
India's Goods and Services Tax (GST) collections increased 13.9% year-on-year to ₹1.94 lakh crore...
By Navya Sree 2026-07-02 12:54:27 0 63
Andhra Pradesh
మార్చి మూడో తారీకు విలేకరుల సమావేశం జరిగింది
ఈరోజు (03 మార్చి, 2026) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/...
By Rajini Kumari 2026-03-03 12:15:33 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com