వృద్ధుడిని బెదిరించి దోపిడి చేసిన ముద్దాయిని కేవలం 48 గంటల వ్యవధిలోనే అరెస్టు చేసి సొత్తు సుమారు 25000/ విలువల కలిగిన 2 బంగారు ఉంగరాలు రికవరీ చేసిన కొల్లిపర అరెస్టు చేసి పోలీస్ వారు

0
68

వృద్ధిడిని బెదిరించి దోపిడీ చేసిన ముద్దాయి ని కేవలం 48 గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి చోరీ సొత్తు సుమారు 250000/- విలువ కలిగిన 2 బంగారు ఉంగరాలు రికవరీ చేసిన కొల్లిపర పోలీస్ వారు 

🚩 ది 18.06.2026 న ఉదయం 07:00 గంటలకు గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం మరియు గ్రామ నివాసి అయిన కొల్లి వెంకట శ్రీనివాస రెడ్డి, S/o రామిరెడ్డి అను అతను ది. 18.06.2026న తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో నిద్రలేచి ఇంటి తలుపు తీయగా, బయట ఉన్న ఒక అపరిచిత వ్యక్తి లోపలికి వచ్చి, ఆయన్ని మంచంపైకి నెట్టి, "నీ చేతికి ఉన్న ఉంగరాలు నాకు ఇవ్వు, లేకపోతే చంపేస్తాను" అని బెదిరించగా భయభ్రాంతులకు గురైన పిర్యాది , తన చేతులకు ఉన్న సుమారు 16 గ్రాములు కలిగిన 2 బంగారు ఉంగరాలు అతనికి ఇచ్చినారు. ఆ అపరిచిత వ్యక్తి ఉంగరాలను మరియు టీవీ టేబుల్ మీద ఉన్న శామ్‌సంగ్ ఫోన్ తీసుకుని పారిపోయాడు. ఎవరో గుర్తుతెలియని దొంగ ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసినట్లు రిపోర్టు ఇచ్చినారు.

📍 కొల్లిపర యస్.ఐ N.C.ప్రసాద్ గారు Cr.No.68/2026 U/s 329(4), 308(2) BNS of Kolliipara PS గా కేసు నమోదు చేసి, కేసు వివరాలు శ్రీ తెనాలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ SK నాయబ్ రసూల్ గారికి తెలియపరచగా, ఇన్స్పెక్టర్ గారి ఉత్తర్వులు మేరకు సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కొల్లిపర శ్రీ N.C.ప్రసాద్ గారు, కొల్లిపర సిబ్బంది HC రామకోటేశ్వరరావు, PC లు రామకృష్ణ ,కూర్మరావు మరియు HG అశోక్ లను ఒక టీం గా ఫామ్ చేసి సదరు కేసులో దర్యాప్తు చేపట్టినారు.

📍 సదరు కేసులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు CC కెమెరా ల ద్వార దర్యాప్తు చేపట్టి దొంగతనం చేసిన వ్యక్తి బాపట్ల జిల్లా,చెరుకుపల్లి మండలం, రాంబొట్లవారి పాలెం గ్రామస్తుడు పగడం ఉమాశంకర్ రెడ్డి గా గుర్తించి ఖచ్చితమైన సమాచారంతో ది.20.06.2026 వ తేది ఉదయం వల్లభాపురం గ్రామ కరకట్ట వద్ద వున్న ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ముద్దాయిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి దొంగిలించబడిన బంగారపు ఉంగరాలు-2 సుమారు 240000/- విలువ కలిగినవి రికవరీ చేసి ముద్దాయిని రిమాండ్ కు తరలించడం జరిగినది..

📍 ఫిర్యాదు అందిన సకాలంలో స్పందించి కేవలం 48 గంటల లోపే దొంగను అరెస్ట్ చేసి, ప్రాపర్టీ రికవరీ చేసిన తెనాలి రురల్ CI నాయబ్ రసూల్ గారిని, కొల్లిపర ఎస్సై ప్రసాద్ గారిని మరియు వారి సిబ్బందిని తెనాలి DSP శ్రీ B. జనార్దన్ రావు గారు అబినందించినారు.

📍ఈ సందర్భంగా తెనాలి డిఎస్పి B జనార్దన్ రావు గారు మాట్లాడుతూ కొల్లిపర మండల గ్రామ ప్రజలందరూ విరివిగా సీసీ కెమెరాలు మీ గృహాలకు అలాగే గ్రామంలో మెయిన్ సెంటర్లో అమర్చుకోవాల్సిందిగా కోరినారు సీసీ కెమెరాలు 24 గంటలు నిఘా కలిగి ఉంటాయి కావున గ్రామస్తులు మరియు దాతలు ముందుకు వచ్చి ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు అమర్చకోవాల్సిందిగా కోరినారు...

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: కరెంటు షాక్‌తో ఎలక్ట్రిషియన్‌కు తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో ఆదివారం, ఎలక్ట్రిషియన్ మహబూబ్ జానీ (38) కొత్తపల్లిలో ఒక ఇంటికి యాంటెన్నా...
By Pagadala Venkateswar 2026-03-01 09:42:22 0 169
Andhra Pradesh
దేవినేని అవినాష్ కామెంట్స్ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు
*దేవినేని అవినాష్ కామెంట్స్* *NTR జిల్లా వైసీపీ అధ్యక్షులు*     ప్రభుత్వ మెడికల్...
By Rajini Kumari 2025-12-13 09:26:17 0 251
Andhra Pradesh
అనంతపురం: జిల్లా ప్రజలకు గొప్ప శుభవార్త
*ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు తీపికబురు* 💐 *ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ* 🙏 *ఆర్డీటీకీ...
By Eslavath RameshNaik 2026-03-24 07:23:35 0 343
Andhra Pradesh
పిల్లల ఎదుగుదలలో పోషకాహారం కీలకం – డాక్టర్ ఉమాకాంత్ సూచనలు
రాజమండ్రి: చిన్నపిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలలో సరైన ఆహారపు అలవాట్లు ఎంతో కీలకమని రాజమండ్రిలోని శ్రీ...
By Ratna Sekhar 2026-03-11 03:42:40 0 333
SURAKSHA
భద్రత కోసం హెల్ప్‌లైన్ సేవలు
 ట్రాఫిక్ సమస్యల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ సేవలు ప్రారంభంకంటెంట్: ఎలివేటెడ్ కారిడార్...
By Kalaga Sailaja 2026-06-29 05:03:40 0 47
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com