క్షేత్రస్థాయిలో మాజీ కార్పొరేటర్.|

0
94

"అర్హులందరూ నమోదు చేసుకోవాలనే లక్ష్యంతో చర్యలు"

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా బండబస్తీ, టెంపుల్ ఆల్వాల్ ప్రాంతాల్లో ఇంటింటికీ ఓటరు నమోదు ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.

బూత్ లెవల్ అధికారులు (BLOలు) చేపడుతున్న ఫారాల పంపిణీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, ప్రతి అర్హుడైన ఓటరికి ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కోరారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడిన శాంతి శ్రీనివాస్ రెడ్డి, ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని కోరారు.

కొత్తగా ఓటర్లుగా నమోదు కావాల్సిన వారు, పేర్లు సవరించుకోవాల్సిన వారు, చిరునామా మార్పులు లేదా ఇతర వివరాల సవరణ అవసరమున్న వారు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇంటింటికీ ఫారాల పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా కొనసాగాలని, ఎవరూ ఈ అవకాశాన్ని కోల్పోకుండా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని ఆమె ఆకాంక్షించారు. 

ప్రజలు కూడా ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సహకరించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

–Sidhumaroju

Search
Categories
Read More
Business & Finance
Renewal Your Trademark Before Protection Expires
Trademark renewal is essential to maintain your exclusive legal rights and protect your brand...
By Navya Sree 2026-07-14 06:20:16 0 56
SURAKSHA
Dalton P. Marak IPS: A Resolute Leader in Policing
A Dedicated Officer Known for Strategic Policing, Public Service and Commitment to...
By Lokeshwari Panthadi 2026-07-22 13:00:24 0 46
Jammu & Kashmir
Title: J&K’s New Stray Dog Guidelines Balance Safety & Compassion
The Jammu & Kashmir Housing & Urban Development Department (HUDD) has introduced pivotal...
By Lokeshwari Panthadi 2026-06-30 05:17:27 0 52
Andhra Pradesh
Annadata Sukhibhava: Who Gets the ₹7,000 First Installment?
🌾 Annadata Sukhibhava: Who Gets the ₹7,000 First Installment? The Andhra Pradesh government...
By Bharat Aawaz 2025-06-26 07:15:53 0 2K
Andhra Pradesh
ఆంధ్రా భోజనం రుచికి జపాన్ దౌత్య సిబ్బంది ఫిదా... సీఎం చంద్రబాబు స్పందన.
ఢిల్లీలోని ఏపీ భవన్‌లో భోజనం చేసిన జపాన్ దౌత్య సిబ్బంది ఆంధ్రా థాలీ రుచులు అద్భుతమంటూ సోషల్...
By Pagadala Venkateswar 2026-01-21 06:05:37 0 179
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com