నందిగామ మండల కార్యాలయంలో MSME రుణాలపై అవగాహన సదస్సు

0
104

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో నందిగామ మండల కార్యాలయంలో MSME ఆధ్వర్యంలో చేతివృత్తుల కార్మికులు, డ్వాక్రా మహిళలకు సబ్సిడీతో కూడిన రుణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో లబ్ధిదారులకు వివిధ రకాల MSME రుణ పథకాల వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు. అనంతరం అర్హులైన సభ్యుల నుంచి రుణాల కోసం దరఖాస్తులు స్వీకరించి పూర్తి చేయించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు ఎం.ఏ. పాషా మాట్లాడుతూ, MSME ద్వారా చేతివృత్తుల వారు ఎటువంటి తాకట్టు లేకుండా రుణాలు పొందే విధానం, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీ వివరాలు, స్వయం ఉపాధి అవకాశాల గురించి వివరించారు.MSME ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చేతివృత్తుల కార్మికులు, డ్వాక్రా మహిళలు, ఇతర లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Rajesh Kumar IPS: Upholding Law with Integrity and Vision
The Journey Begins "The true strength of policing lies not only in enforcing...
By Fathima Safa 2026-07-23 07:44:07 0 28
Telangana
దేవాదుల ప్రాజెక్టు భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వీడియో కాన్ఫరెన్స్‌లో...
By Bheeshman King 2026-07-08 14:15:01 0 83
Andhra Pradesh
మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు,, మంత్రి..మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు...
By Karapati Gopi 2026-06-20 10:16:38 0 246
Telangana
తెలంగాణలో ఐదు రోజులపాటు వర్షాలు.....
50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు తగ్గిన ఎండ తీవ్రత... 43 డిగ్రీలకు దిగొచ్చిన టెంపరేచర్లు.....
By Gujile Ramu 2026-05-07 02:11:24 0 124
Telangana
నిజామాబాద్:
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు....
By Sadaq Sadaq 2026-05-13 04:16:07 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com