ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు: శ్రీగణేష్.|

0
118

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 24 నుంచి జూలై 24 వరకు నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి పోలింగ్ బూత్ వద్ద బీఎల్ఏలతో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. 

వార్డు నంబర్-2లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ..ఓటరు జాబితా సవరణ ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఇప్పటికే ఓటరుగా ఉన్నవారు తమ పేరు జాబితాలో ఉందో లేదో స్వయంగా పరిశీలించుకోవాలని సూచించారు. పేర్లు లేకపోయినా, వివరాల్లో పొరపాట్లు ఉన్నా వెంటనే సరిచేయించుకోవాలని కోరారు.

ఓటర్లు అప్రమత్తంగా లేకపోతే ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో పలు పరిపాలనా, సంక్షేమ అంశాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున బీఎల్ఏలు నెల రోజుల పాటు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పిస్తారని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు. బీఎల్ఏలను ఉద్దేశించి మాట్లాడుతూ అత్యంత బాధ్యతతో విధులు నిర్వహించాలని, ఒక్క అర్హుడి ఓటు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్‌ఐఆర్ కో-ఆర్డినేటర్లు బద్రీనాథ్ యాదవ్, సంకి రవీందర్, వార్డు-2 కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ ప్రతినిధులు, కార్యకర్తలు, బీఎల్ఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
నందిగామ మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు విచారణ
నందిగామ మున్సిపల్ ఆఫీస్ లో ప్రారంభమైన ఏసీబీ అధికారుల విచారణ నందిగామ పట్టణం మున్సిపల్ కార్యాలయంలో...
By Patan Khuddus 2026-04-22 10:04:56 0 297
Andhra Pradesh
మదనపల్లెలో 'ఏక్తాన్' ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఎస్పీ.
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో ఆదివారం ఉదయం ఏక్తాన్ ర్యాలీ ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ ధీరజ్...
By Pagadala Venkateswar 2026-03-08 04:51:58 0 152
SURAKSHA
The Visionary Bureaucrat: Inside Vishal Kumar Dev’s Journey
Driving Odisha’s Digital and Administrative Evolution from the Frontlines: Effective...
By Kalaga Sailaja 2026-07-21 09:33:55 0 27
Andhra Pradesh
అంతర్రాష్ట్ర వాహన చోరీ దొంగ అరెస్ట్: కార్లు స్వాధీనం.
మదనపల్లెలో అంతర్రాష్ట్ర వాహన చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు....
By Pagadala Venkateswar 2026-04-23 03:37:17 0 97
Telangana
నీ పేరు కేసీఆర్ అయితే చర్చకు రా..సీఎం రేవంత్ రెడ్డి
మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ 10...
By Ponnala Srinivasrao 2026-06-07 00:54:43 0 124
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com