"వాసవీ జయంతికి సెలవు: సీఎంలకు కైలాష్ రాంచెందర్ గుప్త ధన్యవాదాలు.|

0
389

హైదరాబాద్ : వాసవీ మాత ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక సెలవు దినంగా ప్రకటించడం పట్ల ఆలిండియా వైశ్య ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేస్తోంది. 

ఈ చారిత్రాత్మక నిర్ణయంపై ఫెడరేషన్ సెక్రటరీ కైలాష్ రాంచెందర్ గుప్త  మాట్లాడుతూ.. అహింసా మూర్తి, త్యాగశీలి అయిన వాసవీ మాత జన్మదినానికి ప్రభుత్వ గుర్తింపు లభించడం యావత్ ఆర్యవైశ్య జాతికి గర్వకారణమని కొనియాడారు. 

ఈ గౌరవం దక్కడం వెనుక ఆర్యవైశ్య ఫెడరేషన్ ఆల్ ఇండియా అధ్యక్షులు, వార్త సీఎండీ, మాజీ రాజ్యసభ సభ్యులు గిరీష్ సంఘీ  అలుపెరుగని కృషి ఎంతో ఉందని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆర్యవైశ్యుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన గిరీష్ సంఘీ కి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

అలాగే, ఈ ఉద్యమంలో నిరంతరం తోడుగా నిలిచిన ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ  సేవలను కూడా ఆయన కొనియాడారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆర్యవైశ్యుల మనోభావాలను గౌరవించి, ఈ పండుగకు అధికారిక గుర్తింపునివ్వడం వారి పరిపాలన దక్షతకు నిదర్శనమని కైలాష్ రాంచెందర్ గుప్త  ప్రశంసించారు.

చివరగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వాసవీ మాత జయంతిని అధికారికంగా గుర్తించి సెలవు దినంగా ప్రకటించినందుకు గాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. 

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవాన్ని గౌరవించడం పట్ల సమాజం తరపున ధన్యవాదాలు అర్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ :సోమల లో ఆరోగ్య దినోత్సవం
సోమల మండల కేంద్రంలోని పీహెచ్సీలో మంగళవారం డాక్టర్ జయసింహ, డాక్టర్ ప్రదీప్ ఆధ్వర్యంలో...
By Kothuru Murali 2026-04-08 07:34:56 0 132
Telangana
కురవి ఎన్నికల ప్రచారసభలో డోర్నకల్ మాజీఎమ్మెల్యే మాజీ మంత్రి డిఎస్ రెడ్యానాయక్..*
*రాజునాయక్ పశువుల వ్యాపారం చేయడం తప్పా, సంతలో బ్రోకర్ (మధ్యవర్తిత్వం) చేయడం తప్పా...!!* ...
By CM_ Krishna 2025-12-16 01:18:24 0 279
Andhra Pradesh
పిల్లి మణిక్యరావు కు స్వగతం పలుకుతూ గుంటూరు అర్బన్ కమిటీ సభ్యులు
పిల్లి మణిక్యరావు కి స్వాగతం పలుకుతూ గుంటూరు అర్బన్ కమిటీ సభ్యులు పదవి ప్రమాణ స్వీకారం లైవ్...
By SivaNagendra Annapareddy 2026-01-21 12:12:27 0 541
Telangana
దండేపల్లి లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం లో పాల్గొన్న శాసనసభ్యులు
మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండలంలోని ధర్మారావుపేట్ గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు ద్వారా 104 మంది...
By Avunoori Mahesh 2026-06-02 12:15:42 0 133
Business & Finance
Choose an Unsecured Loan That Fits Your Financial Goals
An unsecured loan provides quick access to funds without requiring collateral, making it an ideal...
By Navya Sree 2026-07-17 07:55:42 0 44
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com