Voter survey

0
91

తెలంగాణలో నేటి నుంచి ఇంటింటి ఓటరు సర్వే ప్రారంభం

 

తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు) ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు, చేర్పులు నమోదు చేయనున్నారు.

 

సగటున ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఒక బీఎల్ఓను నియమించిన ఎన్నికల అధికారులు, ప్రతి ఇంటికి అవసరమైతే మూడుసార్లు వరకు వెళ్లి వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇంట్లో ఎవరూ అందుబాటులో లేకపోయినా మళ్లీ సందర్శించి వివరాలు నమోదు చేయనున్నారు.

 

ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ప్రజలు బీఎల్ఓలకు సహకరించి సరైన వివరాలు అందించాలని, అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ముద్రగడకు అధికారిక లాంఛనాలు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయం.
మాజీ మంత్రి, ప్రముఖ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో...
By Pagadala Venkateswar 2026-07-15 05:32:58 0 44
Andhra Pradesh
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ అందచేత !!
కర్నూలు : పాణ్యం నియోజకవర్గానికి చెందిన 75 మంది లబ్ధిదారులకు రూ 40,46,836/- సీఎం రిలీఫ్ ఫండ్...
By Hari Krishna 2025-12-22 11:27:31 0 218
Andhra Pradesh
విద్యా సంఘాల నాయకులు అడ్డుకోవడం జరిగింది
ఆదోని లో భాష్యం చైతన్య నారాయణ విద్యాసంస్థలను తనిఖీ చేయాలి. నియమ నిబంధనలను తుంగలోదొక్కి అక్కడ...
By Boya Dasthagiri 2026-05-05 16:26:02 0 134
Telangana
"బోయిన్‌పల్లి పరిధిలో డీసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ కార్డన్ సెర్చ్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మల్కాజిగిరి జోన్ పోలీసులు మంగళవారం...
By Sidhu Maroju 2026-04-15 16:53:48 0 287
Andhra Pradesh
10వ తరగతి పాసైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు పంపిణీ
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు  కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు...
By Patan Khuddus 2026-05-11 11:24:12 0 253
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com