అంజుమన్‌ భూములను ప్రైవేటీకరణ రద్దు చేయాలంటూ విజయవాడలోని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయం ఎదుట గుంటూరు వైఎస్సార సీపి నాయకులు «నిరసన వ్యక్తం చేశారు.

0
161

గుంటూరు జిల్లా మంగళగిరి చిన కాకానిలోని 71.5 ఎకరాల అంజుమన్‌ భూమిని ప్రైవేటీకరణను తక్షణమే విరమించుకోవాలని కోరుతూ మంగళవారం విజయవాడలోని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయం వద్ద గుంటూరు వైఎస్సార్‌ సీపి నాయకులు కార్యాలయం ఎదుట భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అంజుమన్‌ హమారా.. హక్‌ హమారా అంటూ నినాదాల హోరెత్తించారు. రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలంయలో బోర్డు సమావేశం జరుగుతున్న నేపథ్యంలో బోర్డు గుంటూరు అంజుమన్‌ భూమికి సంబంధించి 71.5 ఎకరాల భూమికి సంబంధించి ఐటీ పార్క్‌ నిర్మాణంకు ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ ధర్నా నిర్వహించారు. వక్ఫ్‌ బోర్డు సమావేశం అనంతరం బయటకు వచ్చిన గుంటూరు అంజుమన్‌ అధ్యక్షుడు, వక్ఫ్‌బోర్డు డైరెక్టర్, గుంటూరు తూర్పు నియోజక వర్గ ఎమ్మెల్యే నసీర్‌ అహమ్మద్‌ వైఎస్సార్‌ సీపి నాయకులు అడ్డగించి బోర్డు సమావేశంలో ఏమి తెల్చారో సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. మరలా అఖిల పక్ష సమావేశం నిర్వహించి చెబుతానంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఈ సంధర్భంగా వైఎస్సార్‌ సీపి రాష్ట్ర కార్యదర్శి, షేక్‌ గులాం రసూల్‌ తూర్పు నియోజక వర్గ ఇన్‌చార్జి నూరీ ఫాతిమా, ఎమ్మెల్సీ రుహుల్లా, పార్టీ నాయకులు, ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర కోశాధికారి అబ్దుల్ కలాం మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు సద్దాం ఖాన్, మహమ్మద్ ఆయాజ్ , సయ్యద్ సర్తాజ్ అహ్మద్, నసీమా, మరియు గుంటూరు జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్ భాయ్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం , నూర్ ఖాన్,రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయం ముందు జరిగిన ధర్మ లో తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
హెచ్‌-1బీ ఉద్యోగులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌.. ఇకపై వేగంగా గ్రీన్‌కార్డుల ప్రక్రియ*
* తాత్కాలిక వీసాలపై అమెరికాలో పనిచేస్తూ శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులకు...
By SivaNagendra Annapareddy 2025-12-23 06:33:51 0 172
Telangana
బన్సీలాల్ పేటలోని స్థలం కుర్మ సంఘానిదే : ఎమ్మెల్యే తలసాని
సికింద్రాబాద్ :   బన్సీలాల్ పేట్ లోని ఆ స్థలం కుర్మ సంఘానికి చెందిన స్మశాన వాటిక...
By Sidhu Maroju 2025-09-23 09:02:33 0 247
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణంలో కోనేటి వద్ద వెలిసిన కల్పవృక్ష వాహనంపై దర్శనం ఇచ్చిన రాజమన్నార్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక...
By Kothuru Murali 2026-02-27 11:04:07 0 72
Madhya Pradesh
లయోలా కాలేజ్ లో మిల్లెట్ ఫెస్టివల్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్‌లోని లయోలా డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో మహిళా...
By Sidhu Maroju 2025-09-19 13:37:14 0 244
Andhra Pradesh
పుంగనూరు: యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసిన వారిపై కేసు నమోదు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఉబేదుల్లా కాంపౌండ్ లోని ఓ చింతకాయ గోడౌన్ లో మహమ్మద్ సాద్ (20)...
By Kothuru Murali 2026-01-14 08:49:45 0 120
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com