అంజుమన్ భూములను ప్రైవేటీకరణ రద్దు చేయాలంటూ విజయవాడలోని రాష్ట్ర వక్ఫ్బోర్డు కార్యాలయం ఎదుట గుంటూరు వైఎస్సార సీపి నాయకులు «నిరసన వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి చిన కాకానిలోని 71.5 ఎకరాల అంజుమన్ భూమిని ప్రైవేటీకరణను తక్షణమే విరమించుకోవాలని కోరుతూ మంగళవారం విజయవాడలోని రాష్ట్ర వక్ఫ్బోర్డు కార్యాలయం వద్ద గుంటూరు వైఎస్సార్ సీపి నాయకులు కార్యాలయం ఎదుట భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అంజుమన్ హమారా.. హక్ హమారా అంటూ నినాదాల హోరెత్తించారు. రాష్ట్ర వక్ఫ్బోర్డు కార్యాలంయలో బోర్డు సమావేశం జరుగుతున్న నేపథ్యంలో బోర్డు గుంటూరు అంజుమన్ భూమికి సంబంధించి 71.5 ఎకరాల భూమికి సంబంధించి ఐటీ పార్క్ నిర్మాణంకు ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేయాలంటూ ధర్నా నిర్వహించారు. వక్ఫ్ బోర్డు సమావేశం అనంతరం బయటకు వచ్చిన గుంటూరు అంజుమన్ అధ్యక్షుడు, వక్ఫ్బోర్డు డైరెక్టర్, గుంటూరు తూర్పు నియోజక వర్గ ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్ వైఎస్సార్ సీపి నాయకులు అడ్డగించి బోర్డు సమావేశంలో ఏమి తెల్చారో సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. మరలా అఖిల పక్ష సమావేశం నిర్వహించి చెబుతానంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఈ సంధర్భంగా వైఎస్సార్ సీపి రాష్ట్ర కార్యదర్శి, షేక్ గులాం రసూల్ తూర్పు నియోజక వర్గ ఇన్చార్జి నూరీ ఫాతిమా, ఎమ్మెల్సీ రుహుల్లా, పార్టీ నాయకులు, ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర కోశాధికారి అబ్దుల్ కలాం మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు సద్దాం ఖాన్, మహమ్మద్ ఆయాజ్ , సయ్యద్ సర్తాజ్ అహ్మద్, నసీమా, మరియు గుంటూరు జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్ భాయ్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం , నూర్ ఖాన్,రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయం ముందు జరిగిన ధర్మ లో తదితరులు పాల్గొన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz