అంజుమన్‌ భూములను ప్రైవేటీకరణ రద్దు చేయాలంటూ విజయవాడలోని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయం ఎదుట గుంటూరు వైఎస్సార సీపి నాయకులు «నిరసన వ్యక్తం చేశారు.

0
449

గుంటూరు జిల్లా మంగళగిరి చిన కాకానిలోని 71.5 ఎకరాల అంజుమన్‌ భూమిని ప్రైవేటీకరణను తక్షణమే విరమించుకోవాలని కోరుతూ మంగళవారం విజయవాడలోని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయం వద్ద గుంటూరు వైఎస్సార్‌ సీపి నాయకులు కార్యాలయం ఎదుట భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అంజుమన్‌ హమారా.. హక్‌ హమారా అంటూ నినాదాల హోరెత్తించారు. రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలంయలో బోర్డు సమావేశం జరుగుతున్న నేపథ్యంలో బోర్డు గుంటూరు అంజుమన్‌ భూమికి సంబంధించి 71.5 ఎకరాల భూమికి సంబంధించి ఐటీ పార్క్‌ నిర్మాణంకు ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ ధర్నా నిర్వహించారు. వక్ఫ్‌ బోర్డు సమావేశం అనంతరం బయటకు వచ్చిన గుంటూరు అంజుమన్‌ అధ్యక్షుడు, వక్ఫ్‌బోర్డు డైరెక్టర్, గుంటూరు తూర్పు నియోజక వర్గ ఎమ్మెల్యే నసీర్‌ అహమ్మద్‌ వైఎస్సార్‌ సీపి నాయకులు అడ్డగించి బోర్డు సమావేశంలో ఏమి తెల్చారో సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. మరలా అఖిల పక్ష సమావేశం నిర్వహించి చెబుతానంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఈ సంధర్భంగా వైఎస్సార్‌ సీపి రాష్ట్ర కార్యదర్శి, షేక్‌ గులాం రసూల్‌ తూర్పు నియోజక వర్గ ఇన్‌చార్జి నూరీ ఫాతిమా, ఎమ్మెల్సీ రుహుల్లా, పార్టీ నాయకులు, ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర కోశాధికారి అబ్దుల్ కలాం మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు సద్దాం ఖాన్, మహమ్మద్ ఆయాజ్ , సయ్యద్ సర్తాజ్ అహ్మద్, నసీమా, మరియు గుంటూరు జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్ భాయ్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం , నూర్ ఖాన్,రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయం ముందు జరిగిన ధర్మ లో తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
నిషేధిత గంజాయి విక్రేతల అరెస్ట్. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని షిరిడీ హిల్స్ ప్రాంతంలో...
By Sidhu Maroju 2026-01-07 15:14:21 0 223
Telangana
భూ కబ్జాదారుడంటూ తనపై చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండించిన మామిడి జనార్ధన్ రెడ్డి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని సర్వే నెంబర్ 573, 574 లో ఉన్న ఐదు ఎకరాల స్థల సరిహద్దు...
By Sidhu Maroju 2025-10-11 13:01:46 0 254
Andhra Pradesh
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లకు ఎస్సై మహేష్ హెచ్చరిక
రెచ్చగొట్టే పోస్టులకు చెక్. సుండుపల్లి పోలీసులు హెచ్చరిక. సుండుపల్లి మండలంలోని వాట్సాప్ గ్రూపులో...
By Benguluri Madhubabu 2026-07-13 01:16:00 0 79
Telangana
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు: డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...... ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని బీజేపీ...
By Gujile Ramu 2026-04-23 12:42:07 0 197
Madhya Pradesh
Madhya Pradesh Accelerates Infrastructure and Expressways
Madhya Pradesh continues to expand its infrastructure network through major expressway, highway,...
By Fathima Safa 2026-06-30 08:49:10 0 47
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com