ప్రతి ఏటా లాగే.. ఈసారి కూడా దీక్ష చేపట్టిన పవన్.

0
42

మంగళగిరిలో వార్షిక ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించిన పవన్ కల్యాణ్ 

పానకాల లక్ష్మీనరసింహస్వామికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు

ప్రతి ఏటా నాలుగు నెలల పాటు ఈ దీక్షను పాటిస్తున్న పవన్

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే దీక్ష స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన వార్షిక ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిన్న ఆయన శాస్త్రోక్తంగా ఈ దీక్షను స్వీకరించారు.

 

దీక్షా స్వీకరణకు ముందు పవన్ కల్యాణ్ ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, అష్టోత్తర శతనామావళి పూజ జరిపించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు రాజగోపురం వద్ద ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) సునీల్ కుమార్, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

 

పవన్ కల్యాణ్ ప్రతి ఏటా నాలుగు నెలల పాటు ఈ దీక్షను పాటిస్తుంటారు. తన గురువు నుంచి మంత్రోపదేశం పొందిన నాటి నుంచి ఆధ్యాత్మిక క్రమశిక్షణలో భాగంగా ఈ నియమాన్ని ఆయన అనుసరిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే ఆయన తన ఆధ్యాత్మిక నియమాలను కొనసాగిస్తున్నారు.

 

ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుతో పాటు పలువురు నేతలు, జనసేన నాయకులు పాల్గొన్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు!!
కర్నూలు :  ** ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్, న్యూఢిల్లీ.. ఇంజినీర్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి...
By Hari Krishna 2025-12-22 08:42:23 0 233
Kerala
V.D. Satheesan Named Kerala’s 24th Chief Minister
The Congress High Command officially ended ten days of political suspense by naming V.D....
By Dunna Jessicaruth 2026-05-14 09:55:05 0 148
Andhra Pradesh
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
పూతలపట్టు నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా 135 వ అంబేద్కర్ జయంతి వేడుకులు ఘనంగా జరిగాయి. ముఖ్యతిదిగా...
By Kiran Kumar 2026-04-14 21:45:34 0 284
Assam
Five IAF Heroes Killed in AN-32 Crash at Jorhat, Assam
The nation mourns the tragic crash of an IAF AN-32 transport aircraft at Assam's Jorhat Air Force...
By Tejaswini Komanduru 2026-06-15 10:41:00 0 231
Telangana
పెద్దపల్లి : తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి...!
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కేంద్రానికి చెందిన గీత కార్మికులు బిక్షపతి కుమిరే గ్రామంలో...
By Sunka Santhosh 2026-06-18 19:18:19 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com