హెవీ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
116

 

(23.06.2026),

 

*హెవీ డ్రైవింగ్ శిక్షణపై విధించిన ఆంక్షలు తొలగించాలని మంత్రికి వినతి* 

 

*హెవీ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం...మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి* 

 

రాష్ట్రవ్యాప్తంగా హెవీ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల కార్యకలాపాలపై ఏర్పడిన సమస్యల నేపథ్యంలో వివిధ జిల్లాలకు చెందిన శిక్షణ కేంద్రాల యజమానులు మంగళవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని తాడేపల్లి లోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.

 

పరివాహన్ పోర్టల్‌లో హెవీ డ్రైవింగ్ శిక్షణ ప్రక్రియను నిలిపివేయడం వల్ల శిక్షణార్థులు లైసెన్సులు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, శిక్షణ కేంద్రాలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని వారు మంత్రికి వివరించారు. హెవీ డ్రైవింగ్ శిక్షణ ద్వారా అనేక మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొంటూ విధించిన ఆంక్షలను తొలగించాలని కోరారు.

 

వారి వినతిని ఆలకించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ అంశాన్ని రవాణా శాఖ ఉన్నతాధికారులతో చర్చించి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Kerala
Kerala Strengthens Cultural Heritage Conservation Efforts
Kerala continues to strengthen its cultural heritage conservation initiatives through the...
By Fathima Safa 2026-06-27 12:58:23 0 86
Andhra Pradesh
ఇవాళ 9 మందిMLA లతో భేటీ కానున్న పవన్ కళ్యాణ్
*అమరావతి : జనసేన ఎమ్మెల్యేలతో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమావేశం.*   *ఒక్కో...
By Rajini Kumari 2025-12-19 12:48:30 0 214
Andhra Pradesh
పిన్నెల్లి సోదరులు నరహంతకులు రాష్ట్ర ప్రజలు వారి అరెస్టు స్వాగతిస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
*ప్ర‌చుర‌ణార్థం* 14-12-2025*     పిన్నెల్లి సోద‌రులు...
By Rajini Kumari 2025-12-15 07:47:09 0 352
Andhra Pradesh
గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ శంకుస్థాపనకు గుంటూరు పశ్చిమ నుంచి భారీ బైక్ ర్యాలీతో హాజరైన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు నగర అభివృద్ధిలో కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్డు 3వ దశ శంకుస్థాపన కార్యక్రమానికి గుంటూరు...
By John Baji 2026-01-04 03:46:24 0 216
Telangana
మక్క, వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం
కొమురం భీం జిల్లా కౌటాల మండలం లో నా బార్డ గోదాములో, మార్క్ ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రం, సాండ్ గాం...
By Vangari Praveen 2026-05-01 10:36:01 0 526
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com