రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు ముందస్తు అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించి జిల్లా కలెక్టర్, ఎస్పీ గారు

0
68

రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ గారు

రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా రాక నేపధ్యంలో అత్యంత పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు: మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు

ఈ నెల 27వ తేదీ న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం, క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో సంజీవిని పథకం లో భాగంగా డిజిటల్ నర్వ్ సెంటర్ ప్రారంభించునున్న నేపథ్యంలో ముందస్తుగా భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత, ఐఏఎస్, జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపియస్.,గార్లతో పాటు గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు మరియు జిల్లా అధికారులు పరిశీలించారు.

హెలిప్యాడ్ ప్రదేశం, ప్రజా వేదిక, పార్కింగ్ ప్రాంతాలను, సీఎం కాన్వాయ్ రూట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు చుట్టు ఉన్న ప్రాంతములను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంకా తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ గారు వీఐపీల వాహనాల రాక, సభా స్థలంలో వేదిక, పార్కింగ్‌ ఏరియా, సీఎం ప్రవేశం, నిష్క్రమణ స్థలాలను, హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ఉన్న రూట్ ను, క్షుణ్ణంగా పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. ఇతర శాఖల సమన్వయంతో అన్ని చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ గారి ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో మార్కాపురం జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మార్కాపురం డి.ఎస్.పి యు. నాగరాజు, ఎస్బి ఇన్స్పెక్టర్ యం.శ్రీనివాసరావు, గిద్దలూరు అర్బన్ సీఐ కె. సురేష్, రూరల్ సీఐ రామకోటయ్య, కంభం సీఐ మల్లికార్జున మరియు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
టీడీపీ ప్రచార రథం ప్రారంభం: ప్రమాణ స్వీకారం విజయవంతం చేయాలని పిలుపు.
రాజంపేట పార్లమెంటు కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ ప్రచార రథాన్ని రాజంపేట పార్లమెంటు ప్రధాన...
By Pagadala Venkateswar 2026-02-28 07:00:37 0 128
Telangana
తప్పని తిప్పలు హెచ్ పి గ్యాస్ తలనుకొండపల్లి
తలకొండపల్లి లోని  హెచ్ పి గ్యాస్ ఏజెన్సీ లో ఎగబడినా జనాలు  పెద్ద సంఖ్యలో లైన్ లో...
By MERIGE MALLESH 2026-03-25 09:22:54 0 407
Telangana
మైనంపల్లి సహకారంతో అభివృద్ధి దిశగా మచ్చ బొల్లారం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వార్డు నెంబర్ 133 మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారుల...
By Sidhu Maroju 2026-02-01 10:34:19 0 182
Telangana
"కాంగ్రెస్‌పై బీజేపీ ఆరోపణల సమరం".|
● కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ మీ సేవా కేంద్రం వద్ద ధర్నా. ● దేశ సమగ్రత, జాతీయ భద్రత అంశాలపై...
By Sidhu Maroju 2026-07-23 19:09:28 0 27
Andhra Pradesh
ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లకు కొత్త రూల్.. ఇక‌పై ఆ ప‌రీక్ష పాసవ్వాల్సిందే!
ఏపీలో టీచర్ల ప్రమోషన్లకు టెట్ అర్హత తప్పనిసరి సుప్రీంకోర్టు ఆదేశాలతో పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు...
By Pagadala Venkateswar 2026-05-14 06:03:44 0 103
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com