Madanapalle: చేనేత కార్మికుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘నేతన్న భరోసా’ ఆర్థిక సాయాన్ని రూ. 25 వేలకు పెంచింది.

0
31

Madanapalle: చేనేత కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష, జహా యువసేన నాయకుడు బాలమాలి శేఖర్ పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 'నేతన్న భరోసా' పథకం కింద ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం చేనేత కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయమని వారు తెలిపారు.

 

గతంలో అందించిన మొత్తానికి అదనంగా రూ.1,000 పెంచి రూ.25 వేలుగా ఆర్థిక సాయం అందించడం ద్వారా ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే షాజహాన్ భాష అన్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని వేలాది చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కలగడంతో పాటు వారి జీవనోపాధికి మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు.

 

అదేవిధంగా, చేనేత రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో చేతి మగ్గాలకు నెలకు 200 యూనిట్లు (పవర్‌లూమ్‌లకు) 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కూడా చేనేత కార్మికులకు ఎంతో మేలు చేస్తోందని తెలిపారు. ఈ చర్యలతో ఉత్పత్తి వ్యయం తగ్గి, చేనేత కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: తొలిరోజు 51 మంది గర్హజారి
జిల్లాలో పధోతరగతి పరీక్షలూ ప్రశాంతాంగ ప్రారమ్భమయ్యాయ. తొలి రోజుతెలుగు పరీక్షకు-24-404 మాంధి...
By Sadaq Sadaq 2026-03-14 12:24:55 0 193
Bharat Aawaz
"The Silent Struggle – How Discrimination Still Shadows Equality"
Article 14 of the Indian Constitution promises equality before law. But is this promise felt in...
By Citizen Rights Council 2025-07-24 06:49:51 0 2K
Telangana
రైతు బంధు ఇప్పట్లో లేనట్లే
రైతు బంధు ఇప్పట్లో లేనట్లే   తేల్చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు   సర్పంచ్...
By Ellandula Sandeep 2025-12-25 09:26:40 0 591
Andhra Pradesh
అత్యాయత్నం కేసులో వ్యక్తి అరెస్టు చేసిన ఎస్ఐ గారు
పుంగనూరులో ఈనెల మూడున వెంకటేశ్వర థియేటర్ పక్కన చికెన్ దుకాణ నిర్వాహకుడు శంకరప్ప అనుమానాస్పద...
By Kothuru Murali 2026-01-07 13:00:08 0 175
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం :ఒంగోలు ట్రిపిల్ ఐటీ కి సదుం విద్యార్థి ఎంపిక.
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని మహాత్మ జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాల విద్యార్థి మహమ్మద్ అఫాక్...
By Kothuru Murali 2026-06-30 16:34:20 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com