ఈరోజు మార్కాపురంలో నిర్వహించిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి విజయోత్సవ సభ

0
88

ఈరోజు మార్కాపురంలో నిర్వహించిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి విజయోత్సవ సభలో జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణరెడ్డి గారు, కనిగిరి ఎమ్మెల్యే శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు, గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుమూల అశోక్ రెడ్డి గారు, యర్రగొండపాలెం టిడిపి ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాల్స్‌ను పరిశీలించాము. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదే. ఉమ్మడి ప్రకాశం జిల్లా వరప్రదాయిని అయిన వెలిగొండ ప్రాజెక్టు సప్లై ఛానల్‌ను ప్రారంభించి, ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేస్తూ సాగునీటి కలను సాకారం చేస్తున్నాం. అలాగే మార్కాపురం జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, ప్రాంతీయ ప్రగతిని మరింత వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నాను.

Search
Categories
Read More
Telangana
మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన ఎస్హెచ్ఓ ప్రశాంత్. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : (భారత్ ఆవాజ్ ప్రతినిధి) దేశవ్యాప్తంగా జరుగుతున్న 77వ గణతంత్ర...
By Sidhu Maroju 2026-01-26 11:46:31 0 190
Business & Finance
Title: Gokaldas Exports Emerges as a Top Stock Pick
Bengaluru-based garment manufacturer Gokaldas Exports has been identified as one of the top stock...
By Navya Sree 2026-06-29 05:25:10 0 42
Telangana
NZB: ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల  బలూరా హాస్పిటల్ (బీ) వార్డెన్ యo...
By Sadaq Sadaq 2026-02-09 10:13:43 0 174
SURAKSHA
Shashank Goel, IAS: Driving Excellence in Public Governance
A distinguished IAS officer whose visionary leadership, administrative excellence, and commitment...
By Lokeshwari Panthadi 2026-07-10 12:05:36 0 112
Telangana
మంచిర్యాల్: నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ బంగారు ఆభరణాలు, నగది ఉన్న భాగ్యం మర్చిపోగా ఆ భాను పోలీసులకు...
By Bonagiri RaviShankar 2026-05-26 13:45:11 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com