"మల్కాజిగిరి కమిషనరేట్‌కు కొత్త క్యాంప్ కార్యాలయం ప్రారంభం."|

0
118

"ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు అందించడమే లక్ష్యం: డీజీపీ సీ.వి. ఆనంద్."

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడం, పరిపాలనా సమర్థతను పెంపొందించడం లక్ష్యంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు కొత్త క్యాంప్ కార్యాలయాన్ని తెలంగాణ డీజీపీ సీ.వి. ఆనంద్ ఐపీఎస్, బుధవారం  తెలంగాణ ప్రభుత్వ సలహాదారు సుధర్షన్ రెడ్డితో కలిసి ఆయన ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు.

సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు సమీపంలోని మల్కాజిగిరి జోనల్ కార్యాలయ ఆవరణలో ఈ క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా డీజీపీ సీ.వి. ఆనంద్ మాట్లాడుతూ, కమిషనరేట్ సేవలను వికేంద్రీకరించడం ద్వారా ప్రజలకు మరింత సులభంగా పోలీసు సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించి, స్థానిక స్థాయిలోనే సేవలను అందించేలా ఈ క్యాంప్ కార్యాలయం పనిచేస్తుందన్నారు.

మల్కాజిగిరి, ఉప్పల్ జోన్ల పరిధిలోని పోలీసు స్టేషన్ల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంలో ఈ కార్యాలయం కీలక పాత్ర పోషించనుంది. మొత్తం 11 పోలీసు స్టేషన్ల పరిపాలనా వ్యవహారాల పర్యవేక్షణ, కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇది ఉపయోగపడనుంది. 

ఫీల్డ్ స్థాయి అధికారులకు, ఉన్నతాధికారులకు మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజల ఫిర్యాదులు, సమస్యల పరిష్కారంలో వేగం పెంచుతుందని అధికారులు తెలిపారు.

ప్రజా భద్రత, సేవల నిర్వహణలో సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటూ మరింత సమర్థవంతమైన పోలీసింగ్ అందించేందుకు ఈ క్యాంప్ కార్యాలయం దోహదపడుతుందని డీజీపీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఐపీఎస్, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి ఐఏఎస్, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఐపీఎస్, పోలీసు శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Telangana
భాద్యతలు చేపట్టిన నూతన సర్పంచ్ భాగ్యమ్మ
 డిసెంబర్ 22 (భారత్ అవాజ్):కొత్తగూడ మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో సోమవారం రోజున నూతనంగా...
By Bheeshman King 2025-12-22 16:41:55 0 371
Andhra Pradesh
2029 నాటికి ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యం
2029 నాటికి ప్రతి ఇంటిపై సోలార్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని...
By Rajini Kumari 2025-12-19 10:30:44 0 203
Andhra Pradesh
అయోధ్య శ్రీరాముని విగ్రహావిష్కరణ ప్రాణ ప్రతిష్టాపన నేటికి రెండేళ్లు
*ప్రసిద్ధ పుణ్య‌క్షేత్రం అయోధ్య శ్రీరామ మందిరంలో బాలరాముని (రాం ల‌ల్లా) విగ్రహ...
By Rajini Kumari 2026-01-22 12:17:19 0 198
Andhra Pradesh
కర్నూలు లో క్లీన్ & గ్రీన్ సిటీ కార్యక్రమం !
కర్నూలు : స్వచ్ఛ నగర సాకారానికి కీలక అడుగులు!! కర్నూలును స్వచ్ఛ నగరంగా సాకారం చేయాలనే...
By Hari Krishna 2025-12-14 10:12:16 0 334
Business & Finance
Increase Authorised Capital the Right Way Today
Increasing authorised capital allows a company to issue additional shares and raise funds for...
By Navya Sree 2026-07-09 07:01:19 0 82
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com