పెట్టుబడులే లక్ష్యం.. రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.

0
68

 

 

పెట్టుబడులే లక్ష్యం.. రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు

13-06-2026 Sat

Andhra

Chandrababu Naidu to visit Singapore tomorrow aiming for investments

సింగపూర్ పర్యటనలో కీలక భేటీలు

సింగపూర్ ప్రధాని, మంత్రులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం

అమరావతి నిర్మాణంపై సుర్బానా జురాంగ్ సంస్థతో చర్చలు

2026 సీఐఐ భాగస్వామ్య సదస్సు రోడ్‌షోలో పాల్గొననున్న ముఖ్యమంత్రి

ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్‌లో పర్యటించనున్నారు. జూన్ 14 నుంచి సాగే ఈ పర్యటనలో రాష్ట్రానికి, ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు సమీకరించడంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇందుకోసం రేపు ఉదయం బెంగళూరు నుంచి ఆయన సింగపూర్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణ, పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటన‌కు వెళ్ల‌నున్నారు.

 

పర్యటనలో భాగంగా చంద్రబాబు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో పాటు ఆ దేశ ఉప ప్రధాని, వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్, విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్, హోం మంత్రి షణ్ముగమ్ వంటి కీలక నేతలతో సమావేశమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వ విధానాలను వారికి వివరించనున్నారు. తొలుత సింగపూర్‌లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో భేటీ అయి పర్యటన అజెండాపై చర్చిస్తారు.

 

పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు గూగుల్ క్లౌడ్, జీఐసీ, వైసీహెచ్ లాజిస్టిక్స్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ కానున్నారు. స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ అధ్యక్షుడితోనూ సమావేశమై విద్యా రంగంలో భాగస్వామ్యంపై చర్చిస్తారు. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన అంశం రాజధాని అమరావతి. రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించిన సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులతో అమరావతి ప్రణాళికపై ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

 

పర్యటనలో భాగంగా 'వరల్డ్ సిటీస్ సమ్మిట్'లో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం 2026లో విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా ఏర్పాటు చేసిన బిజినెస్ రోడ్‌షోలో చంద్రబాబు పాల్గొంటారు. పర్యటన ముగించుకుని 16న రాత్రి 10 గంటలకు ఆయన తిరిగి స్వదేశానికి రానున్నారు. ముఖ్యమంత్రి వెంట పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, సీఆర్డీఏ అధికారుల బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటుంది.

Search
Categories
Read More
Telangana
"2BHK ఇళ్లు, తాగునీరు, ఆరోగ్య కేంద్రాల కోసం హౌసింగ్ కార్పొరేషన్ వద్ద ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వినతి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై...
By Sidhu Maroju 2026-06-09 09:52:34 0 151
Andhra Pradesh
News reporter
To day joined in Bharath Awaz News Thanks for Giving This opportunity AsA News Reporter #...
By Rajini Kumari 2025-12-15 07:15:36 2 2K
Kerala
High Command’s "New Face" Strategy for Kerala
The appointment of V.D. Satheesan is being viewed by analysts as a strategic shift by the...
By Dunna Jessicaruth 2026-05-14 10:13:28 0 125
Andhra Pradesh
శ్రీరామ్ చినబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి...
By Benguluri Madhubabu 2026-03-15 10:51:28 0 239
Telangana
నిజామాబాద్: 27 వ డివిజాన్ లో చలివేంద్రం ప్రారంభం
నిజామాబాద్:ఈరోజు 27వ డివిజన్ వర్ని చౌరస్తాలో ఖిల్లా రామ్ మందిర్ ప్రధాన కార్యదర్శి కల్పే చిరంజీవి...
By Sadaq Sadaq 2026-04-19 12:04:32 0 120
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com