ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్.. ఇలా చెక్ చేసుకోండి!

0
83

 

 

ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్.. ఇలా చెక్ చేసుకోండి!

13-06-2026 Sat 15:37

Andhra

Minister Nara Lokesh releases IIIT admission results check details here

ఆర్జీయూకేటీ ఆరేళ్ల బీటెక్ కోర్సు ప్రవేశాల ఫలితాలు విడుదల

2026–27 విద్యా సంవత్సరానికి 4,040 మంది విద్యార్థుల ఎంపిక

ఎంపికైన వారిలో 96.7% మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే

గ్రామీణ ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యమన్న విద్యాశాఖ మంత్రి లోకేశ్

ఎంపికైన విద్యార్థులు rgukt.in వెబ్‌సైట్ నుంచి లేఖలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. 2026–27 విద్యా సంవత్సరానికి గానూ ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం ప్రొవిజనల్ సెలెక్షన్ జాబితాను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం విశేషం.

 

ఈ ఏడాది మొత్తం 44,104 దరఖాస్తులు రాగా, వారిలో 4,040 మంది విద్యార్థులను తాత్కాలికంగా ఎంపిక చేసినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. నూజివీడు, ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ), ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఈ ప్రవేశాలు కల్పించనున్నారు. ఎంపికైన వారిలో 96.7 శాతం మంది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులే ఉండటం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ గ్రామీణ ప్రతిభను ప్రోత్సహించాలన్న ఆర్జీయూకేటీ లక్ష్యం మరోసారి నెరవేరిందని లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.

 

ఎంపికైన విద్యార్థులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అభ్యర్థులు తమ ఎంపిక పత్రాలను (Selection Letters) అధికారిక వెబ్‌సైట్ rgukt.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఏవైనా సందేహాలుంటే, సహాయం కోసం 9552300009 అనే వాట్సాప్ హెల్ప్‌డెస్క్ నంబర్‌ను సంప్రదించవచ్చని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

Search
Categories
Read More
Telangana
🗳️ గ్రామాభివృద్ధికి ఓటుతో మార్గం! – తెలంగాణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో
గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే కేవలం ఓట్ల పండుగ కాదు – ఇది గ్రామ ప్రజల చేతిలో అభివృద్ధికి...
By Pulse 2025-06-25 10:04:17 0 1K
Andhra Pradesh
విశాఖ నగర ప్రజలకు పోలీస్ వారి ముఖ్య గమనిక
విశాఖ నగర ప్రజలకు పోలీస్ వారి ముఖ్య గమనిక
By Bharat Aawaz 2025-05-28 14:43:50 0 2K
Telangana
తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత గారి ప్రెస్ నోట్
ప్రెస్ నోట్. *రేపు నిజామాబాద్ కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన* *శ్రీ రఘునాథ స్వామి (ఖిల్లా...
By Veeresh Kumar 2026-03-26 14:03:50 0 387
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:కల్లూరు లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరులో బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి...
By Kothuru Murali 2026-02-19 09:55:08 0 168
Andhra Pradesh
పేదల సేవలో భాగంగా ఈరోజు దర్శి మండలం, జముకులదిన్నె పంచాయతీలో ముందస్తుగా “ఎన్టీఆర్ భరోసా పెన్షన్” కార్యక్రమం నిర్వహించి లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్లు అందజేశారు
పేదల సేవలో భాగంగా ఈరోజు దర్శి మండలం, జముకులదిన్నె పంచాయతీలో ముందస్తుగా “ఎన్టీఆర్ భరోసా...
By Chennaiah Kati 2026-02-01 07:07:45 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com