ఆర్టీసీపై కాంగ్రెస్ కుట్రలు.. ఎవడబ్బ జాగీరు అని డిపోలను ధారాదత్తం చేస్తారు?: తలసాని నిప్పులు.|

0
192

సికింద్రాబాద్ : తొంభై ఏళ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన ఆర్టీసీ మనుగడకు కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పు తలపెడుతోందని బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాణిగంజ్ డిపో వద్ద ఆందోళన చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాలో పాల్గొని ఆయన తన పూర్తి మద్దతు ప్రకటించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఎవడబ్బ జాగీరు అని డిపోలను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తారని నిలదీశారు.

ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువచ్చి ఆర్టీసీ ఉద్యోగులను రోడ్డున పడేయాలని ప్రభుత్వం చూస్తోందని, ఆ బస్సులను కూడా సంస్థ డ్రైవర్లు, కండక్టర్లతోనే నడిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారని, దీన్ని బిఆర్ఎస్ ప్రోద్బలంగా చిత్రీకరించడం మంత్రుల అవివేకమని తలసాని విమర్శించారు.

సురక్షిత ప్రయాణానికి మారుపేరుగా నిలిచిన ఆర్టీసీ అభివృద్ధిలో కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని, ముఖ్యంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో వారి పాత్ర ఎంతో గొప్పదని గుర్తు చేశారు.

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో వారికి అండగా ఉండి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

#sidhumaroju

Search
Categories
Read More
Tamilnadu
Stalin Introspects After DMK’s Election Defeat
Following the victory of the Tamilaga Vettri Kazhagam (TVK), DMK President and former CM M.K....
By Dunna Jessicaruth 2026-05-14 11:20:40 0 67
Andhra Pradesh
విజయవాడలో మహిళ దారుణ హత్య
*_విజయవాడలో మహిళా దారుణ హత్య.._*   విజయవాడ రెండో పట్టణం గవర్నర్ పేట వద్ద మహిళను గొంతు కోసి...
By Rajini Kumari 2026-04-14 09:19:12 0 112
Telangana
కరీంనగర్ PMJ జూవెలర్స్ లో భారీ చోరి
న్యూస్ టుడే కరీంనగర్  ఈరోజు 10:40 PMJ గోల్డ్బై షాప్ఆ రుగురు  చైన కొనడానికి వచ్చి గన్...
By Bouth Arun 2026-05-03 12:59:58 0 100
Telangana
మనుషుల ! మానుల !
కరీంనగర్ జిల్లా పాత డిఐజి బంగ్లా ఎదురుగా జ్యోతి నగర్ ఏరియాలో నిర్జీవంగా ఉన్న నన్ను నిందితునిగా...
By Thalakokkula Sadanandam 2026-04-03 06:31:06 0 275
Andhra Pradesh
Pawan Kalyan: మనకెందుకులే అనుకోవద్దు... ప్రతి భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంటుంది: పవన్ కల్యాణ్.
హిందూ ధర్మంపై దాడులు జరిగినప్పుడు మౌనం వీడాలని పవన్ పిలుపు   కేవలం భక్తులుగా కాకుండా ధర్మ...
By Pagadala Venkateswar 2026-02-06 14:19:38 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com