మంచిర్యాల జిల్లా కేంద్ర లైబ్రరీలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చర్యలు

0
146

మంచిర్యాల జిల్లా : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గత పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్ర లైబ్రరీని సందర్శించిన సందర్భంగా అక్కడ చదువుతున్న విద్యార్థులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థుల ఇబ్బందులను సానుకూలంగా స్పందించిన ఎంపీ, వెంటనే వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ని ఆదేశించారు,దీనిలో భాగంగా విద్యార్థులకు అవసరమైన వాష్‌రూమ్‌లు మరియు తాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేయగా, ఈరోజు వాటి పనితీరును సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు,ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు కష్టపడి చదివి తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. అలాగే మంచిర్యాల జిల్లా నుండి అధిక సంఖ్యలో యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు, అదేవిధంగా పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ లో పోస్టులను పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి కృషి చేస్తానని తెలిపారు,విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: సంఘమిత్రలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పుంగనూరు నియోజకవర్గంలో సంఘమిత్రులకు 5జీ స్మార్ట్ ఫోన్ల...
By Kothuru Murali 2026-05-05 15:19:46 0 100
Andhra Pradesh
ప్రపంచ ఆర్థిక సదస్సు మూడో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమైన తమార లేజర్ సీఈవో సృష్టి సిబిలాల్
*దావోస్: ప్రపంచ ఆర్ధిక సదస్సు మూడో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన తమారా లీజర్ సీఈఓ సృష్టి...
By Rajini Kumari 2026-01-21 14:42:49 0 156
SURAKSHA
Vani Mohan, IAS: Leading Excellence in Governance
A Distinguished Civil Servant Advancing Administrative Excellence, Inclusive Development, and...
By Lokeshwari Panthadi 2026-07-13 08:47:40 0 58
Telangana
గంగోత్రికి వెళ్తున్నారా. ఈ రూల్స్ పాటించాల్సిందే
చార్ధామ్ యాత్రలో భాగమైన గంగోత్రిలో భక్తుల ప్రవేశానికి సంబంధించి ఆలయ కమిటీ కొత్త రూల్...
By MERIGE MALLESH 2026-04-22 11:21:10 0 589
Telangana
ఐజి విగ్రహం నుండి ఐస్ ఫ్యాక్టరీ వరకు 100 అడుగుల రహదారి నిర్మాణం- ప్రజల డిమాండ్ మేరకు ఎమ్మెల్యే తక్షణ స్పందన
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్.     బీఆర్‌ఎస్ నాయకుడు ప్రశాంత్ రెడ్డి...
By Sidhu Maroju 2025-09-14 11:08:55 0 297
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com