ఏపీలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్-2026 ప్రారంభం... తొలి మ్యాచ్ లో కాకినాడ కింగ్స్ గెలుపు.

0
103

 

ఏపీలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్-2026 ప్రారంభం... తొలి మ్యాచ్ లో కాకినాడ కింగ్స్ గెలుపు

 

Andhra

Andhra Premier League 2026 begins in AP Kakinada Kings win first match

విశాఖలో నిరాడంబరంగా ప్రారంభమైన ఏపీఎల్ సీజన్ 5

తొలి మ్యాచ్‌లో కాకినాడ కింగ్స్ ఘన విజయం

మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ యువన్

శ్రీనాద్రి వైజాగ్ లయన్స్‌పై 71 పరుగుల భారీ తేడాతో గెలుపు

బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి సత్తా చాటిన కాకినాడ జట్టు

విశాఖపట్నంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఐదో సీజన్ ప్రారంభమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా ఎలాంటి వేడుకలు లేకుండా టోర్నమెంట్‌ను నిరాడంబరంగా మొదలుపెట్టారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టోర్నీని ప్రారంభించారు. ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో కాకినాడ కింగ్స్ జట్టు, సింహాద్రి వైజాగ్ లయన్స్‌పై ఘన విజయం సాధించింది.

 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కాకినాడ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ బ్యాటర్ యువన్ సిక్సర్లతో విరుచుకుపడి అజేయ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. ఓపెనర్ అభిషేక్, అర్జున్, తపస్వి, మనీష్, వికెట్ కీపర్ లక్షజ్ రెడ్డి కూడా దూకుడుగా ఆడి తమ వంతు పరుగులు జోడించారు.

 

అనంతరం 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వైజాగ్ లయన్స్ జట్టు, కాకినాడ బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. 18.4 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో కాకినాడ కింగ్స్ 71 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. బౌలింగ్‌లో ఆంజనేయులు 3 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన యువన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన కాకినాడ కింగ్స్.. ఈ సీజన్‌లో తమ ప్రయాణాన్ని ఘన విజయంతో ఆరంభించింది.

Search
Categories
Read More
Telangana
కాగజ్‌నగర్‌లో 26 బాండెడ్ లేబర్లకు విముక్తి: సబ్ కలెక్టర్
కాగజ్‌నగర్‌లో 26 బాండెడ్ లేబర్లకు విముక్తి: సబ్ కలెక్టర్ కాగజ్‌నగర్ మండలం ఈస్గాం...
By Pinnehasan Odela 2026-02-02 14:46:03 0 351
Andhra Pradesh
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రూరల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి
నందవరం సబ్ ఇన్స్పెక్టర్ గారి పై చర్యలు తీసుకోవాలి వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్...
By Boya Dasthagiri 2026-05-20 12:14:20 0 204
Andhra Pradesh
పుంగనూరు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి గాయాలు
పుంగనూరు మండలం గాంధీపురం సమీపంలో 42వ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలు...
By Kothuru Murali 2026-04-21 14:53:24 0 104
Telangana
రాజీవ్ గాంధీ నగర్ లో రేషన్ షాపు ఏర్పాటు చేయండి: ఎమ్మెల్యేకు వినతి
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా:  వెంకటాపురం డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ బస్తీ వాసులు ప్రభుత్వ...
By Sidhu Maroju 2025-09-17 11:18:54 0 294
Andhra Pradesh
ఈ నెల 14 నుంచి 16 వరకు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన.
ఈ నెల 14 నుంచి 16 వరకు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన *భారత్ ఆవాజ్ న్యూస్ * సీఎం చంద్రబాబుతో...
By Chennaiah Kati 2026-06-11 08:06:17 0 111
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com