తూర్పు గోదావరి ట్రిపుల్ మర్డర్ కేసు: జీవిత ఖైదీకి క్షమాభిక్ష నిరాకరించిన సుప్రీంకోర్టు.

0
94

జీవిత ఖైదు నుంచి విడుదల చేయాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం

గతంలోనూ ఓ హత్య కేసులో శిక్ష అనుభవించినట్లు గుర్తించిన కోర్టు

బైపోలార్ డిజార్డర్ వాదనను పరిగణనలోకి తీసుకోని సర్వోన్నత న్యాయస్థానం

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో 2015లో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన శిక్షను తగ్గించి, విడుదల చేయాలని కోరుతూ దోషి ఏడిద ఆనందకుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

 

కేసు వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన ఆనందకుమార్ గతంలో తన సోదరుడితో కలిసి ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించి విడుదలయ్యాడు. అయితే, తన నేర చరిత్రను ప్రస్తావిస్తూ ఇరుగుపొరుగు వారు హేళన చేస్తున్నారనే కక్షతో 2015 డిసెంబర్ 24న ఇనుప పైపుతో దాడి చేసి ఏడిద విజయలలిత, గెడ్డం నాగభూషణం, ఖండవల్లి కుమారి అనే ముగ్గురిని దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో కూడా రాజమండ్రి ట్రయల్ కోర్టు అతనికి జీవిత ఖైదు విధించగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం ఆ తీర్పును సమర్థించింది.

 

హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆనందకుమార్ ఈ ఏడాది మే 25న సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తాను బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నానని, తన మానసిక పరిస్థితి దృష్ట్యా శిక్ష నుంచి ఉపశమనం కల్పించాలని అభ్యర్థించాడు. అయితే ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. "ఒక హత్య కేసులో శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత, మళ్లీ ముగ్గురిని దారుణంగా చంపిన వ్యక్తికి ఉపశమనం ఎలా కల్పిస్తాం?" అని న్యాయస్థానం ప్రశ్నించింది. అతనికి నేర చరిత్ర ఉన్నందున క్షమాభిక్షకు అర్హుడు కాదని స్పష్టం చేస్తూ, పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Search
Categories
Read More
Gujarat
Gujarat Strengthens Disaster Management and Preparedness
Gujarat continues to enhance its disaster management framework through advanced early warning...
By Fathima Safa 2026-07-02 09:15:23 0 71
Andhra Pradesh
ప్రజలు డిసెంబర్ 31 ఆంక్షలు పాటించాలని సిఐ గారి విన్నపం గారి విన్నపం
ఆంక్షలు పాటించాలని అర్బన్ సీఐ సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో...
By Kothuru Murali 2025-12-30 12:53:07 0 178
Andhra Pradesh
ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్.. ఇలా చెక్ చేసుకోండి!
    ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్.. ఇలా చెక్...
By Pagadala Venkateswar 2026-06-13 11:13:08 0 82
Telangana
ADB: రిమ్స్ లో బాలింత మృతి.. ఏడుగురిపై చర్యలు
రిమ్స్లో ఉట్నూర్ మండలం పిట్లగూడకు ఆదివాసీ మహిళ గంగశీల మృతి ఘటనలో ఏడుగురు సిబ్బందిపై జిల్లా...
By Mitappaly Shiavji 2026-01-01 04:00:48 0 610
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:43:03 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com