ప్రధానిగా మోదీ రికార్డ్... చంద్రబాబు, నారా లోకేశ్ స్పందన.

0
59

 

ప్రధానిగా మోదీ రికార్డ్... చంద్రబాబు, నారా లోకేశ్ స్పందన

10-06-2026 Wed 09:55

Andhra

Narendra Modi sets record as Prime Minister Chandrababu Naidu and Nara Lokesh react

సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతున్న మోదీకి చంద్రబాబు, లోకేశ్ అభినందనలు

దేశ గతిని మార్చిన గొప్ప నేతగా మోదీని అభివర్ణన

సంక్షేమం, అభివృద్ధిని మోదీ సమన్వయం చేశారన్న సీఎం

వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర నిర్మిస్తామని వెల్లడి

మోదీ ఘనత అనితరసాధ్యమని లోకేశ్ వ్యాఖ్య

మోదీ నాయకత్వంలో భారత్ అజేయశక్తిగా నిలిచిందని ప్రశంస

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతూ ఒక చారిత్రక మైలురాయిని అందుకున్న సందర్భంగా మోదీకి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కేవలం దేశాన్ని పాలించడమే కాకుండా, దాని గతిని మార్చే కొద్దిమంది నేతల్లో మోదీ ఒకరని చంద్రబాబు కొనియాడారు.

 

గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 4,399 రోజులు ప్రధానిగా సేవలందించారని, ఈ ప్రయాణంలో ప్రతి స్థాయిలో భారతదేశాన్ని మార్చడానికి విశేషంగా కృషి చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. సామాన్యుడి జీవితం నుంచి ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్ఠ వరకు ప్రతి అంశంలోనూ ఆయన ముద్ర ఉందని వివరించారు. "ఇంట్లోని మంచినీటి కుళాయి నుంచి చంద్రయాన్ విజయం వరకు, పొలంలోని రైతు ఆకాంక్షల నుంచి సరిహద్దులోని సైనికుడి ధైర్యం వరకు.. ప్రగతి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా మోదీ చూశారు" అని అన్నారు.

 

బలహీన వర్గాలకు మద్దతిస్తూనే, ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధికి బాటలు వేయడం ఆయన పాలనలోని ప్రత్యేకత అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మోదీ నాయకత్వంలో నేడు భారతదేశం తన భవిష్యత్తుపై మరింత విశ్వాసంతో, లక్ష్యాలపై మరింత ఆశావహ దృక్పథంతో ఉందని తెలిపారు.

 

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మోదీకి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. వికసిత భారత్ అనే మోదీ దార్శనికతకు అనుగుణంగా స్వర్ణాంధ్రను నిర్మించేందుకు తాము కట్టుబడి ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.

 

మోదీ రికార్డు అనితరసాధ్యం: నారా లోకేశ్  

 

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి కొనసాగుతుండడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వరుసగా ఎన్నికై, దేశాన్ని అత్యధిక కాలం పాలించిన నేతగా మోదీ నిలవడం చరిత్రాత్మకమని అన్నారు.

 

ఈ విషయంపై నారా లోకేశ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, "మన దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించి మోదీ నెలకొల్పిన ఈ రికార్డు అనితరసాధ్యం" అని కొనియాడారు. 12 ఏళ్ల పాలనలో నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక అజేయశక్తిగా సగర్వంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

 

ప్రజలకు అవకాశాలు, గౌరవం కల్పించడంతో పాటు, దేశాన్ని స్వావలంబన, సాధికారత దిశగా నడిపించిన ఘనత మోదీకే దక్కుతుందని లోకేశ్ ప్రశంసించారు. మోదీ సమర్థవంతమైన నాయకత్వానికి జేజేలు పలుకుతున్నట్లు ఆయన తన ప్రకటనలో వివరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నంద్యాల పార్లమెంట్ కమిటీ ఏర్పాటు !!
కర్నూలు : పాణ్యం : తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల...
By Hari Krishna 2025-12-26 16:22:23 0 229
Telangana
ఆకస్మికంగా తనిఖీ చేసిన :: జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్
మహబూబాబాద్::::పట్టణంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ...
By Bheeshman King 2026-03-11 11:07:18 0 363
Business & Finance
Fuel Surcharge Cut Lowers Power Costs in Madhya Pradesh
Electricity consumers across Madhya Pradesh will benefit from a reduction in the fuel surcharge...
By Navya Sree 2026-07-01 05:27:39 0 43
Andhra Pradesh
విధుల్లోకి డిప్యూటీ సీఎం పవన్.. నేడు అమరావతికి.
శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న డిప్యూటీ సీఎం పవన్ మూడు వారాల విశ్రాంతి తర్వాత నేడు మంగళగిరికి...
By Pagadala Venkateswar 2026-05-13 06:02:40 0 78
Telangana
ఘనంగా సౌందర్యలహరి లలిత పారాయణ వరలక్ష్మి వ్రత పూజ
     హైదరాబాద్/బాకారం.        బాకారం ముషీరాబాద్ లోని తన...
By Sidhu Maroju 2025-08-02 14:26:08 0 847
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com