"డ్రైనేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు? – కాలనీవాసుల ప్రశ్నలు.|

0
107

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని బొల్లారం సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్-14లో డ్రైనేజ్ సమస్య స్థానికులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. 

గత కొన్ని రోజులుగా మురుగు నీరు పొంగిపొర్లుతూ రహదారిపైకి చేరుతుండటంతో కాలనీవాసులు దుర్వాసన, దోమల బెడదతో అసహనానికి గురవుతున్నారు.

డ్రైనేజ్ నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో పాదచారులు, వాహనదారులు రాకపోకలు సాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఆరోగ్యపరమైన సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని వారు చెబుతున్నారు.

ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే చర్యలు తీసుకుని డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని, రహదారిపై నిలిచిపోయిన మురుగు నీటిని తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. 

సమస్య మరింత తీవ్రం కాకముందే సంబంధిత శాఖ అధికారులు స్పందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
కూడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : కమిషనర్
కర్నూలు :  కర్నూలు సిటీ :  కూడళ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ➡️ నగరపాలక సంస్థ...
By Hari Krishna 2026-02-03 12:16:03 0 377
Andhra Pradesh
ఏపీ కొత్త జిల్లాల ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదం
 ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది....
By John Baji 2025-12-29 09:19:48 0 133
Andhra Pradesh
test
test
By Hazu MD. 2026-03-23 11:00:13 0 330
Andhra Pradesh
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన_ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ...
By John Baji 2026-01-01 02:48:16 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com