నూతన బస్సు సర్వీసు ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

0
610

హనుమకొండ జిల్లాలోని పరకాల నుంచి శాయంపేట మీదుగా సాధనపల్లి వరకు నూతన బస్సు సేవ ప్రారంభమైంది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రజా విజ్ఞప్తి మేరకు ఈ సేవను మంజూరు చేయించి శనివారం ఉదయం మండలకేంద్రంలో ఘనంగా జెండా ఊపి ప్రారంభించారు.ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితంగా ఉంటుందని ఈ సౌకర్యం విద్యార్థులకు, స్థానిక ప్రజలకు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని, చిరు వ్యాపారులకు, పట్టణాలకు అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళే ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. మండలంలోని కొన్ని గ్రామాల మధ్య సరైన ప్రభుత్వ రవాణా లేకపోవడం వల్ల గతంలో ప్రజలు ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వచ్చేదని దీని వలన ఖర్చు, సమయం అధికంగా ఉండేదని కావున సామాన్య ప్రజలకు మేలు చేసే విధంగా,ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే విధంగా ఈ బస్సు సర్వీసును ప్రారంభిస్తున్నట్టు,కావున ప్రజలు ఆర్టీసీ సేవలను వియోగించుకుని తద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లి తమ వంతు సహకారాన్ని కూడా అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్, M.P.D.O ఫణిచంద్ర, మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చల్లా చక్రపాణి, మార్కెట్ వైస్ చైర్మన్ మారపెల్లి రవీందర్, మస్కే కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Puducherry
Puducherry Expands Digital Public Services for Citizens
Puducherry continues to strengthen digital public services by expanding citizen-centric...
By Fathima Safa 2026-06-29 08:28:53 0 51
Business & Finance
Build Your Dream Business with OPC Registration
A One Person Company (OPC) is the perfect business structure for solo entrepreneurs, freelancers,...
By Navya Sree 2026-07-13 10:01:18 0 51
Andhra Pradesh
మదనపల్లిలో ట్రాఫిక్ నియంత్రణకు 10 బూత్‌లు ప్రారంభం.
మదనపల్లి పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు కొత్త అడుగు వేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్...
By Pagadala Venkateswar 2026-05-06 06:49:19 0 103
Andhra Pradesh
సుదీర్ఘ సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ను సన్మానించి అత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు
సుదీర్ఘ సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ను సన్మానించి అత్మీయ వీడ్కోలు పలికిన...
By Chennaiah Kati 2026-02-03 18:13:35 0 225
Andhra Pradesh
ఆఫీసులు సరే....నివాసాలెక్కడ?
మదనపల్లె కేంద్రంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లా యంత్రాగానికి కావాల్సిన ప్రభుత్వ కార్యాలయాల భవనాల...
By Pagadala Venkateswar 2026-01-08 10:38:27 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com