కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విపత్తు నిర్వహణ ముందస్తు చర్యలు: సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ కె. హరిత, ఎస్పీ నితికా పంత్ ఆదేశం

0
218

🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. హరిత IAS గారు రియు జిల్లా ఎస్పీ నితికా పంత్ IPS గారి  నేతృత్వంలో రాబోయే వర్షాకాలాన్ని పురస్కరించుకుని భారీ వర్షాలు, వరదలు మరియు ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో విపత్తు నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. హరిత మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రతి ప్రభుత్వ శాఖ ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని, వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాలను ముందే గుర్తించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని, క్షేత్రస్థాయిలో కంట్రోల్ రూమ్‌లను నిరంతరం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అనంతరం ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ పోలీస్ శాఖ తరఫున విపత్తుల సమయంలో తక్షణ రక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DDRF) బృందాలను అవసరమైన లైఫ్ జాకెట్లు, బోట్లు, ఇతర రక్షణ సామాగ్రితో సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రెవెన్యూ, పోలీస్, నీటి పారుదల (ఇరిగేషన్), పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య, మున్సిపల్ పరిపాలన, రహదారులు మరియు భవనాల (R&B), విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL), అగ్నిమాపక, మరియు సమాచార పౌర సంబంధాల శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు మరియు ప్రతినిధులు ప్రత్యక్షంగా పాల్గొని సమన్వయంతో విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వాల్మీకి నాయకులు రామ్ భీం నాయుడు మాజీ జెడ్పిటిసి
వాల్మికుల చిరకాల కోరిక అయిన S.T. రిజర్వేషన్ అంశం మీద అసెంబ్లీలో మాట్లాడాలని మాజీ మంత్రివర్యులు...
By Boya Dasthagiri 2026-07-04 12:45:06 0 91
Andhra Pradesh
కబడ్డీ పోటీల నిర్వహణ:
క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని కర్నూలు మండలం పంచలింగాల గ్రామంలో ABM చర్చ్ ఆధ్వర్యంలో...
By Hari Krishna 2025-12-27 16:13:13 0 194
Telangana
ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిన పదవ తరగతి కూతురు.
మేడ్చల్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.  NLB నగర్లో నివాసముండే తల్లి అంజలి(39)ని తన...
By Sidhu Maroju 2025-06-24 04:55:54 0 1K
Andhra Pradesh
గుంటూరు జిల్లాSP శ్రవణ్ కుమార్ జిందల్IPS గారు అవగాహన కార్యక్రమం
*ప్రెస్ నోట్* *గుంటూరు జిల్లా పోలీస్...* *తేది: 23.12.2025*   _*//రోడ్డు ప్రమాదాలు మరియు...
By Rajini Kumari 2025-12-24 08:23:37 0 319
Andhra Pradesh
బోయకొండ దేవాలయంలో హుండీ లెక్కింపు జరిగింది ఈరోజు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయానికి గురువారం...
By Kothuru Murali 2026-01-08 12:40:58 0 173
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com