నారాయణపేట జిల్లాలో దారుణ
భరత్ అవాజ్
సూర్యమోహన్
నారాయణపేట జిల్లాలో దారుణ
ఘటన వెలుగుచూసింది నగల కోసం ఓ మహిళను దుండగులు హత్య చేశారు
పది రోజుల క్రితం అదృశ్యమైన ఆ మహిళ విగతజీవిగా కనిపించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలకలాన్ని రేపింది
పోలీసుల వివరాల ప్రకారం మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జాదరవ్ పల్లి గ్రామానికి చెందిన శాంతమ్మ అనే మహిళ పది రోజుల క్రితం అదృశ్యమైంది
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పట్లోనే పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు
ఈ క్రమంలో నిన్న సాయంత్రం నారాయణపేట మండలం జాజపూర్ గ్రామ శివారులోని ఓ చెరువు సమీపంలో ఉన్న చెట్ల పొదల్లో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు
నగల కోసమే హత్య
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు మృతురాలి ఒంటిపై ఉండాల్సిన బంగారు, వెండి నగలు కనిపించకపోవడంతో కేవలం ఆ నగల కోసమే దుండగులు ఆమెను దారుణంగా హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
పోలీసుల అదుపులో నిందితులు
కాగా ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత హత్య ఎలా జరిగింది
ఎంతమంది పాల్గొన్నారు
తదితర పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz