ఆసిఫాబాద్ పట్టణ దస్నాపూర్ అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం మరియు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జిల్లా కలెక్టర్ కె. హరిత ఐఏఎస్

0
242

🎤 కొమురం భీమ్ ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని దాస్నాపూర్ కాలనీలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్లు కాలిపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ కె. హరిత IAS గారు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం వేగంగా స్పందించి తక్షణ సహాయక చర్యలు చేపట్టిందని, ప్రమాదంలో ఇళ్లు పూర్తిగా కాలిపోయి నష్టపోయిన రెండు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా రూ. 95,100 ల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు ఆమె తెలిపారు. అలాగే ప్రమాద తీవ్రతకు పాక్షికంగా ఇల్లు దెబ్బతిన్న మరొక బాధిత కుటుంబానికి రూ. 9,000 ల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశామని, దీంతో పాటు అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు శాశ్వత నివాస వసతి కల్పించేందుకు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ల ఆదేశాల మేరకు తక్షణమే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (PD) ను ఆదేశించినట్లు కలెక్టర్ గారు చెప్పారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల అత్యవసర సహాయక చర్యలు, పునరావాస పనులు క్షేత్రస్థాయిలో నిరంతరాయంగా కొనసాగుతాయని ఆమె తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
హై - టీ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి !!
కర్నూలు : సోమవారంకర్నూలు కలెక్టరేట్  సునయన ఆడిటోరియంలో "క్రిస్మస్" పండుగ సందర్భంగా మైనార్టీ...
By Hari Krishna 2025-12-16 06:49:17 0 244
Andhra Pradesh
చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజ దర్బార్ నిర్వహించిన కలెక్టర్ గారు
ఈరోజు చిత్తూరు కలెక్టర్  ఆఫీసులో కలెక్టర్ గారు ప్రజాదర్బార్ నిర్వహించారు ఇందులో ప్రజలు ...
By Kothuru Murali 2025-12-29 14:22:43 0 184
Andhra Pradesh
పుంగనూరులో నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్
పుంగనూరు పట్టణంలోని ప్రైవేట్ బస్టాండులో ఆటో డ్రైవర్ అప్సర్ బాషాకు దొరికిన రూ.21 వేలున్న పర్సును...
By Kothuru Murali 2026-04-09 07:40:23 0 130
Andhra Pradesh
మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: భాస్కర్.
మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఏఆర్టీ కేంద్రంలో గురువారం సాయంత్రం 'మిషన్ ఎయిడ్స్ సురక్ష'...
By Pagadala Venkateswar 2026-05-08 05:24:16 0 97
Andhra Pradesh
కియా ఈవీ హబ్, విశాఖలో ఎక్స్‌పోర్ట్ సెంటర్.. కొరియాలో మంత్రి లోకేశ్‌ కీలక భేటీలు.
ఏపీలో ఈవీ, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని విస్తరించాలని కియాకు లోకేశ్‌ ప్రతిపాదన విశాఖ...
By Pagadala Venkateswar 2026-07-09 05:40:45 0 63
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com