డ్రగ్స్ మరియు నేర రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరం : డీసీపీ మంచిర్యాల ఎ. భాస్కర్

0
122

మంచిర్యాల జిల్లా : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యక్రమం)లో భాగంగా ఈ రోజు బెల్లంపల్లి-2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్‌నగర్‌లో ప్రజా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్,బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ హాజరై ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ, గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం యువత ఆరోగ్యం,భవిష్యత్తు, విద్య,ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు.మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తులు కుటుంబానికి, సమాజానికి భారంగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతర పర్యవేక్షణ కలిగి ఉండాలని సూచించారు.ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఆన్‌లైన్ మోసాలు, ఓటీపీ మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాలు,సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే మోసాలు,ఫేక్ లింకులు,డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు,పాస్‌వర్డ్లు ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని హెచ్చరించారు.సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, మహిళలు,బాలికలు ఎలాంటి వేధింపులు, గృహ హింస,సైబర్ వేధింపులు లేదా ఇతర సమస్యలు ఎదుర్కొన్నా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ చేపడుతున్న ప్రత్యేక చర్యలు, అందుబాటులో ఉన్న సేవల గురించి వివరించారు.మాదక ద్రవ్యాల విక్రయం, రవాణా,వినియోగం, సైబర్ మోసాలు లేదా మహిళలపై జరిగే నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించాలని ప్రజలను కోరారు.డ్రగ్స్ రహిత,నేర రహిత సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, ప్రజల సహకారంతోనే శాంతిభద్రతల పరిరక్షణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు.ఈ అవగాహన కార్యక్రమంలో బెల్లంపల్లి-2 టౌన్ ఎస్‌ఐ కిరణ్ కుమార్, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, స్థానిక ప్రజాప్రతినిధులు, సంఘాల ప్రతినిధులు, కాలనీ వాసులు, యువత,మహిళలు, కమ్యూనిటీ సభ్యులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
"Sindhu Pillai A., IPS: Safeguarding Andaman with Vision"
An accomplished IPS officer leading law & order, intelligence, disaster management, and...
By Lokeshwari Panthadi 2026-07-24 07:01:52 0 26
Business & Finance
PF Registration for Employee Retirement Benefits
Provident Fund (PF) Registration is a mandatory requirement for eligible establishments under the...
By Navya Sree 2026-07-24 05:15:27 0 18
Andhra Pradesh
సారస్ జాతీయ స్థాయి కార్యక్రమం
 సారస్ (SARAS) జాతీయ స్థాయి ప్రదర్శన జనవరి 6 నుంచి 18 వరకు గుంటూరులో జరుగుతుందని జిల్లా...
By John Baji 2026-01-02 08:35:33 0 160
Andhra Pradesh
నందవరంలో శ్రీమాతా బంగారం అవ్వ దేవాలయమును దర్శించుకున్న ఎర్రకోట రాజీవ్ రెడ్డి
నందవరం మండలం, గ్రామం నేడు ఆధ్యాత్మికోత్సాహంతో కళకళలాడింది. భక్తి పరవశంలో మునిగిపోయిన గ్రామ ప్రజల...
By Boya Dasthagiri 2026-04-02 10:03:20 0 260
Andhra Pradesh
పుంగునూరులో చీపురు పట్టిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి
స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ మిషన్, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాల్లో భాగంగా, అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్...
By Kothuru Murali 2026-05-23 14:13:50 0 77
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com