ఆసిఫాబాద్‌ దస్నాపూర్‌లో అగ్నిప్రమాద బాధితులకు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పరామర్శ: తక్షణ ఆర్థిక సహాయం అందజేత

0
110

🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని దస్నాపూర్‌లో అర్ధరాత్రి వేళ జరిగిన ఘోర అగ్నిప్రమాదం బాధితులను మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా లైబ్రరీ చైర్మన్ అనిల్ కుమార్ గురువారం పరామర్శించారు. ప్రమాదంలో ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులైన బాధితులను వారు కలిసి ఓదార్చారు. అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదైన ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టపోయిన కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులకు ధైర్యం చెబుతూ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా ప్రత్యేక కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాద ఘటన తీవ్రతను మరియు బాధితుల దుస్థితిని జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గారి దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన తక్షణమే సానుకూలంగా స్పందించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అందవలసిన అత్యవసర సహాయాన్ని వెంటనే అందిస్తామని, అలాగే నిరాశ్రయులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పరంగా తగిన సహాయ సహకారాలు త్వరితగతిన అందేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్ రాపర్తి కార్తీక్, గులాం జావిద్, NSUI జిల్లా నాయకులు ఆసిఫ్, సర్పంచ్ బసవయ్య, మేకర్తి శ్రీను, నిఖిల్, రాజేందర్, జమీర్, అబ్బు, బండి సాయి, చాపడి సురేష్‌లతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం.
పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి....
By Kothuru Murali 2026-01-26 07:07:12 0 159
Andhra Pradesh
BITS Pilani: ఏపీ రాజధాని అమరావతిలో బిట్స్ పిలానీ... సీఆర్డీఏతో కీలక ఒప్పందం.
బిట్స్ పిలానీ ఏర్పాటుకు తుళ్లూరు మండలంలోని మందడం, వెంకటపాలెం గ్రామాల పరిధిలో 70 ఎకరాలు కేటాయించిన...
By Pagadala Venkateswar 2026-01-31 06:10:24 0 125
Andhra Pradesh
Pawan Kalyan: ఢిల్లీలో డిప్యూటీ సీఎం.. పిఠాపురం అభివృద్ధికి పవన్ ప్రత్యేక చొరవ.
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ పిఠాపురం...
By Pagadala Venkateswar 2026-01-29 07:03:07 0 127
Prop News
Redefining Real Estate with Transparency & Trust
Real estate is one of the most significant industries in the world, yet it remains complex,...
By Hazu MD. 2025-05-19 11:32:11 0 3K
Andhra Pradesh
మదనపల్లెలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై భారీ ర్యాలీ.
అన్నమయ్య జిల్లా యంత్రాంగం ఆదివారం మదనపల్లెలో ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ...
By Pagadala Venkateswar 2026-01-25 12:40:19 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com