కేసీఆర్ తెలంగాణకు తురుపు ముక్క కాదు...కలుపు మొక్క..బల్మురి వెంకట్

0
99

కేసీఆర్ తెలంగాణకు తురుపు ముక్క కాదు...కలుపు మొక్క.

‎కేసీఆర్ తెలంగాణకు ఓజీ కాదు.... నాజీ గా పని చేశారు.

‎నాజీలా (నియంతలా) పదేళ్లు తెలంగాణ ప్రజలను అణిచివేసారు.

‎అందుకే ప్రజలు 2023 ఎన్నికల్లో అధికారం నుంచి దించేశారు.

‎కనీసం ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా చేయడం లేదు.

‎అందుకే మీరు మీటింగ్ అన్న, ధర్నాలు అన్న ప్రజలు ఎవరు రావడం లేదు.

‎అందుకే బీఆర్ఎస్ నేతల్లో అసహనం పెరిగిపోయింది, 

‎ఆవేశంతో ప్రజలను రెచ్చగొడుతున్నారు. 

‎మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని మీకు అప్పగిస్తే , రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది మీరు . 

‎తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర అప్పు 72 వేల కోట్లుంటే , 10 ఏళ్లలో అప్పులను 7 లక్షలకోట్ల కు తీసుకెళ్లారు . 

‎మీరు చేసిన అప్పులకు అసలు , వడ్డీ కలిపి నెలకు 6 వేల కోట్లు మేము బ్యాంకులకు వడ్డీ కడుతున్నాము . 

‎మీరు చేసిన అప్పు 2 లక్షల 80 వేల కోట్లని పచ్చి అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు .

‎ ‎ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసమే 1 లక్ష కోట్లు అప్పులు తెచ్చారు . 

‎ఈ అప్పు ఏ విధంగా తీరుస్తారని బ్యాంకులు అడిగితే , కాళేశ్వరం నీళ్లు అమ్మి తీరుస్తామని చెప్పి అప్పు తెచ్చిన ఘనులు మీరు . 

‎కూలిపోయి చుక్క నీరు రాని కాళేశ్వరం నీళ్లు ఏ విధంగా అమ్మి అప్పు తీర్చాలో కేటీఆర్ సమాధానం చెప్పాలి . 

‎కాలం చెల్లిన టెక్నాలజీ తో మీరు కట్టిన యాదాద్రి , భద్రాద్రి ధర్మల్ స్టేషన్లలో విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరిగి పోయి రాష్ట్రానికి గుదిబండలుగా మారాయి .

‎ అదీకాక , బొగ్గుగనులున్న ప్రాంతానికి దూరంగా ధర్మల్ స్టేషన్స్ కట్టడంతో , బొగ్గు రవాణా ఖర్చు తడిసి మోపెడవుతున్నది .

‎ బాధ్యతలేని, చేతగాని పాలన సాగించారు . 

‎ప్రజల సొమ్ముకాబట్టి ఇష్టానుసారం ఖర్చుపెట్టి దుర్వినియోగం చేయడంతో ఇప్పుడు అవి ప్రజల నెత్తిన గుదిబండలుగా మారిపోయాయి . లక్ష కోట్లతో మీరు కట్టిన కాళేశ్వరం రెండేళ్లలో కూలిపోయి మొండిగోడలతో వెక్కిరిస్తున్నది .

‎ దీనికి సిగ్గుపడాల్సింది పోయి , గొప్ప ఘనకార్యం చేసినట్లు కాళేశ్వరం నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్నారు .

‎పార్టీ వర్కింగ్ పెసిడెంట్ పదవి నీకు ఇస్తే , అప్పుడు వర్కింగ్ ముఖ్యమంత్రిగా , ఇప్పుడు వర్కింగ్ ప్రతిపక్షనాయకుడిగా చలామణి అవుతున్నావు . 

‎త్రీ ట్రిలియన్ లో ఎన్ని సున్నాలున్నాయో రేవంత్ రెడ్డి కి తెలియదంటున్నారు . 

‎అధికారంలో ఉన్నప్పుడు పొద్దున్న లేచింది మొదలు కుంభకోణాలు చేసి వేల కోట్లు కొట్టి వేసిన వాడివి .

‎దోపిడీలకు పాల్పడినవాడివి . కోట్లు , మిలియన్ల , ట్రిలియన్ల లెక్కలు బాగాతెలిసిన వాడివి . 

‎ఏ లెక్కకు ఎన్ని సున్నాలున్నాయో నీకు బాగా తెలుసు . కోట్లు లెక్కపెట్టి , పెట్టి నీ చేతులు నెప్పి పుడుతుండాలి . 

‎పదేళ్లు అసమర్థ పాలన అందించిన బీఆర్ఎస్ నేతలు... ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా నిర్వహించలేకపోతున్నారు.

‎అందుకే వాళ్ల మీటింగ్ లు అన్న, ధర్నాలు అన్న ప్రజలు వచ్చే పరిస్థితి లేదు.

‎ఈ విషయాన్ని స్వయంగా వాళ్ల నాయకులే బయటకు చెబుతున్నారు.

‎ఇకనైనా బుద్ధి తెచ్చుకుని మాట్లాడక పోతే.... ప్రజలు ఈ యింత పదవులు కూడా ఊదగొడుతారు.

‎దమ్ముంటే.... ప్రజా సమస్యలపై చిత్త శుద్ధి ఉంటే... సభా వేదికగా చరచుకు సిద్ధం.

‎మీరంతా ప్రతిపక్ష నాయకుడితో సభకు రండి, చర్చకు సిద్ధం.

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద...
By Chennaiah Kati 2026-06-14 07:03:02 0 95
Andhra Pradesh
చెడును త్వజించి మంచిని ఆహ్వానించడమే భోగి అంతరార్థం
*చెడును త్యజించి, మంచిని స్వీకరించడమే భోగి అంతరార్థం. ఈ భోగి మీ ఇంట సిరిసంపదలు కురిపించాలని...
By Rajini Kumari 2026-01-14 12:29:11 0 166
Andhra Pradesh
కాకినాడ రూరల్‌లో విషప్రయోగం ఘటన – మూగజీవాలు అనుమానాస్పద మృతి
కాకినాడ రూరల్ మండలంలో మూగజీవాలు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆకస్మికంగా మేత...
By Ratna Sekhar 2026-02-13 13:41:15 0 543
SURAKSHA
Bangalore Police Today: Service Beyond Duty Hours
: Bangalore Police officers once again proved humanity today. In Majestic and suburban areas,...
By Kalaga Sailaja 2026-07-06 06:29:04 0 157
Andhra Pradesh
మదనపల్లి: మరణించిన హోంగార్డు కుటుంబానికి అండగా పోలీస్ శాఖ.
విధి నిర్వహణలో అకాల మరణం చెందిన కేవీ పల్లె పోలీస్ స్టేషన్ హోంగార్డు వేణుగోపాల్ కుటుంబానికి పోలీస్...
By Pagadala Venkateswar 2026-03-02 11:50:26 0 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com