చింతూరు పోలీసుల తనిఖీలో గంజాయితో పట్టుబడ్డ యువకులు!

0
192

చింతూరు మండలం మోటు జంక్షన్ వద్ద పోలీసులు బుధవారం సాధారణ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఒకే స్కూటీపై అనుమానాస్పదంగా వస్తున్న ముగ్గురు యువకులను ఆపి తనిఖీ చేయగా అసలు రంగు బయటపడింది. వారి వద్ద నుంచి ఏకంగా 4 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.వీరంతా ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు పట్టుబడిన ముగ్గురు యువకులు హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.సీజ్ చేసిన గంజాయి విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందని అంచనా గంజాయి స్మగ్లింగ్‌పై నిఘా తీవ్రం చేశాం. అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. యువత ఇలాంటి వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు అని ఎస్,ఐ సంతోష్ ఈ సందర్భంగా తెలిపారు.ప్రస్తుతం నిందితులపై కేసు నమోదు చేసి, ఈ నెట్‌వర్క్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో చింతూరు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Business & Finance
TDS Returns: Stay Compliant and Avoid Tax Penalties
TDS (Tax Deducted at Source) returns are quarterly statements filed by deductors to report tax...
By Navya Sree 2026-07-18 05:44:59 0 34
Andhra Pradesh
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. 25 కంపార్టుమెంట్లలో భక్తులు.
వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 12 గంటల సమయం...
By Pagadala Venkateswar 2026-02-25 09:00:40 0 290
Andhra Pradesh
ప్రముఖ పద్యకవి చదలవాడ లక్ష్మీనరసింహారావు కన్నుమూత.
ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ పద్యకవి, 'పద్యభారతి' బిరుదాంకితులు చదలవాడ లక్ష్మీనరసింహారావు (90)...
By Pagadala Venkateswar 2026-04-13 05:54:58 0 145
Andhra Pradesh
ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్‌లో.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
  ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్‌లో.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు 10-06-2026 Wed 07:14...
By Pagadala Venkateswar 2026-06-10 05:50:36 0 67
Telangana
భారీగా హవాలా నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.|
సికింద్రాబాద్ : బోయిన్ పల్లి ప్రాంతంలో కారు టైరులో, సీట్ల కింద తరలిస్తున్న రూ.4 కోట్ల  నగదు...
By Sidhu Maroju 2025-12-05 10:38:45 0 325
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com