గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతూ పట్టుబడిన ఇద్దరు నిందితులు.. పరారీలో మరో ఇద్దరు

0
131

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా,విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పట్టుకుని,వారి వద్ద నుంచి గంజాయి, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్ పోలీసు సిబ్బందితో కలిసి బీ పవర్ హౌస్ టర్నింగ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా,బోరే కిషన్ (26), రామగుండం, లింగంపల్లి శ్రావణ్ కుమార్ (26), ఇందిరమ్మ కాలనీ, ఎన్టీపీసీ ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, గంజాయిని కొనుగోలు చేసి కొంత వినియోగించడంతో పాటు మిగిలిన గంజాయిని ఎన్టీపీసీ ప్రాంతంలో కూలీ పనులు చేసే ఇతర రాష్ట్రాల కార్మికులకు విక్రయించేందుకు తీసుకువచ్చినట్లు ఒప్పుకున్నారు.పంచుల సమక్షంలో నిర్వహించిన తనిఖీల్లో వారి వద్ద ఉన్న బ్యాగులో 748 గ్రాముల గంజాయి లభ్యమైంది.స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.37,500/- గా అంచనా వేశారు. అలాగే నేరానికి ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమరవాణాను అడ్డుకుని, చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న ఎన్టీపీసీ ఎస్ఐ టి.ఉదయ్ కిరణ్ మరియు పోలీసు సిబ్బందిని ఏసీపీ గోదావరిఖని ఎం.రమేష్, రామగుండం సీఐ కృష్ణకుమార్తో పాటు ఉన్నతాధికారులు అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కంభంపాటి రామ్మోహన్ రావుకు సృజన చౌదరి పరామర్శ
కంబంపాటి రామ్మోహన్ రావు కు సుజనా పరామర్శ..             ...
By Rajini Kumari 2025-12-20 11:35:34 0 192
Andhra Pradesh
మదనపల్లె: ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి రైతు మృతి.
మదనపల్లెలోని ఒక ఆసుపత్రిలో గురువారం ఆపరేషన్ వికటించి రైతు శ్రీనివాసులు నాయుడు (51) మృతి చెందిన...
By Pagadala Venkateswar 2026-05-28 06:47:56 0 72
Andhra Pradesh
ట్విన్స్ సర్ప్రైజ్.. సేమ్ మార్క్స్
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండంలో ట్విన్స్ తమకొచ్చిన ఇంటర్ మార్కులతో అందరినీ ఆశ్చర్యానికి...
By Boiena Rajesh 2026-04-15 13:04:02 0 185
Telangana
గాదే ఇన్నారెడ్డి అరెస్ట్.|
     హైదరాబాద్ :  మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు అరెస్ట్...
By Sidhu Maroju 2025-12-21 11:54:18 0 213
Telangana
బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నూనె, గ్యాస్ లేకుండా ఆరోగ్యకరమైన వంటల పోటీలు మహిళలను అభినందించిన రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి విజయ...
By Jagadeesh Babu 2026-06-19 14:53:55 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com