అమ్మకానికి ఏపీ పట్టణాలు దొడ్డిదారిన మళ్లీ చెత్త పన్ను

0
163

*అమ్మకానికి ఏపీ పట్టణాలు*

 

*దొడ్డిదారిన మళ్లీ చెత్త పన్ను*

 

*వ్యాపార సంస్థలుగా మున్సిపాలిటీలు*

 

*వికసిత్ ఏపీ పేరిట వినాశకర ప్రైవేటీకరణ విధానాలు*

 

*మున్సిపల్ స్థలాలు, సర్వీసులను ప్రైవేటేకరిస్తూ జీవో 673 విడుదల*

 

*ప్రతి పనికి రేటు కట్టి ఫీజులు వసూలు చేయనున్న మున్సిపాలిటీలు*

 

*ఖాళీ స్థలాలు, కాంప్లెక్స్లు, కార్యాలయాలు.. సర్వం 99 ఏళ్లకు బడా కంపెనీలకు లీజులు*

 

*జీవో 673 ఉపసంహరించాలి, లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం*

 

-సిహెచ్ బాబురావు, సిపిఎం

 రాష్ట్ర కార్యదర్శి వర్గ

 సభ్యులు 

 

#నేడు విజయవాడలోని

 సిపిఎం కార్యాలయంలో

 జరిగిన పత్రికా విలేకరుల

 సమావేశంలో బాబురావు,

 రాష్ట్ర కమిటీ సభ్యులు డి.

 కాశీనాథ్ తో కలిసి

 మాట్లాడారు*

 

#బాబురావు మాట్లాడుతూ.....

 

*రాష్ట్రంలో కూటమి, ఎన్డీఏ పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మున్సిపాలిటీలను ప్రైవేటీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 673 విడుదల చేయటం శోచనీయం*

 

*వికసిత్ భారత్, ఏపీ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినాశకర విధానాలు చేపట్టడం దుర్మార్గం*

 

*రాష్ట్రంలోని 123 కార్పొరేషన్ లు, మున్సిపాలిటీలు, 21 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలలోని ఆస్తులను బడా కంపెనీలకు ధారాదత్తం చేయడానికి పూనుకోవటం గర్హనీయం*

 

*మున్సిపల్ స్థలాలు, కమర్షియల్ కాంప్లెక్స్ లు, కార్యాలయాలు, పార్కులు, ఆడిటోరియంలు, స్టేడియంలు... సర్వం.. కారు చౌకగా ప్రైవేటీకరణ ముసుగులో బడా సంస్థలకు దఖలుపరిచే ప్రయత్నాలు ప్రమాదకరం*

 

*మంచినీటి సరఫరా, డ్రైనేజీ, పారిశుద్ధ్య నిర్వహణ, వీధిలైట్లు మొత్తం పౌర సేవలను వ్యాపార పరం చేస్తూ ఆదేశాలు ఇవ్వడం హానికరం*

 

*గత ప్రభుత్వంలో రుద్దిన చెత్త పన్నును, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు, పోరాడారు, ఫలితంగా చెత్త పన్ను రద్దయింది*

 

*కూటమి ప్రభుత్వం యూజర్ చార్జీల పేరుతో చెత్త పన్ను, మంచినీరు, డ్రైనేజీ తదితర పౌర సేవలు అన్నింటి పైన భారం వేయటానికి ఆదేశాలు ఇవ్వటం నమ్మకద్రోహమే*

 

*ఒకవైపున పేదలకు పట్టాలిస్తాం అని.. మురిపిస్తూ.. మరోవైపున పేదల మురికివాడలను తొలగించి, ప్రైవేట్ కంపెనీల స్థలాలను కట్టబెట్టి పేదల పొట్ట కొట్టడానికి కూటమి సర్కార్ కుట్ర పన్నుతోంది*

 

*పట్టణాభివృద్ధికి 45 వేల కోట్ల రూపాయల నిధులు అవసరమని.. ప్రభుత్వం వాటిని సమకూర్చలేదనే సాకుతో.. పట్టణాలను బడా సంస్థల దయాదాక్షిన్యాలకు వదిలిపెట్టడం తగదు*

 

*పట్టణాలలో పౌర సదుపాయాలను కల్పించలేక ఎన్డీఏ ప్రభుత్వం చేతులెత్తేయటం బాధాకరం*

 

*పట్టణ స్థానిక సంస్థలను కార్పొరేట్ సంస్థలుగా చేయటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది*

 

*పౌర సదుపాయాలన్నిటిని వ్యాపార సరుకులుగా మార్చుతోంది*

 

*ప్రజల ఆస్తులను బడా కంపెనీలకు కట్టబెట్టటమే కాకుండా, వయబుల్ గ్యాప్ ఫండింగ్ పేరుతో వారికి ప్రభుత్వ నిధులను కూడా సమకూర్చటానికి సర్కార్ ఆదేశాలు ఇవ్వటం తగదు*

 

*రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ 99 బ్రాండ్ గా మార్చుకున్నారు, 99 పైసలకే కార్పొరేట్లకు భూములు కట్టబెడుతున్నారు, ఇప్పుడు 99 సంవత్సరాలు పాటు మున్సిపల్ ఆస్తులను ధారధక్తం చేస్తున్నారు, 99 ప్రభుత్వంగా మారిపోయింది*

 

*కార్పొరేట్ విద్యాసంస్థలను నడుపుతున్న మంత్రి నారాయణ మున్సిపాలిటీలను కూడా కార్పొరేట్ సంస్థలుగా మార్చే ప్రయత్నాలు చేయటం దుర్మార్గం*

 

*అభివృద్ధి పేరుతో వినాశకర విధానాలను పాలకులు చేపట్టారు*

 

*ఒకవైపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రూపాలలో పన్నులు వసూలు చేస్తూ, స్థానిక సంస్థలలో ప్రతి సంవత్సరం ఇంటి పన్ను 15% చొప్పున, ఐదేళ్లలో 130% పైగా పెంచారు*

 

*మళ్లీ ప్రతి పనికి రేటు కట్టి యూజర్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించడం విచారకరం*

 

*మున్సిపల్ సర్వీసుల ప్రైవేటీకరణతో ఉద్యోగుల, కార్మికుల భవిష్యత్తు అంధకారంగా మారుతుంది*

 

*స్థానిక సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోతాయి*

 

*ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం లో రోడ్ల ప్రైవేటీకరణ ప్రారంభమైంది*

 

*విజయవాడలో వాణిజ్యసముదాయాలను అభివృద్ధి పేరుతో కూల్చడానికి సన్నాహాలు చేస్తున్నారు, భవాని ఐలాండ్ ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఆర్టీసీ స్థలాలను లూలూ కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నాలు చేశారు, బస్ డిపోలను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారు*

 

*రాష్ట్ర అభివృద్ధికి ,ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమైన జీవో 673 ఉపసంహరించాలి*

 

*దీనికి వ్యతిరేకంగా సిపిఎం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడుతుంది, ప్రజలందరూ ఈ విధానాలను నిరసించాలి*

 

#కాశీనాథ్ మాట్లాడుతూ..

 

*ప్రజల ఆస్తులను సొంత సొమ్ము లాగా కేటాయింపులు చేయటం పాలకులకు తగదు*

 

*మున్సిపాలిటీలలో వాహన డిపోలలో ప్రైవేటు వాహనాలను ప్రవేశపెట్టి కార్మికులను దెబ్బతీయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి*

 

*పిపిపి ముసుగులో రోడ్లను ప్రైవేటు కంపెనీలకి కట్టబెడుతూ నడకను వ్యాపారంగా మారుస్తున్నాయి*

 

*యూజర్ చార్జీలో ముసుగులో ప్రజలపై భారాలు వేయటం తగదు*

 

*ఐక్య ఉద్యమం ద్వారా వీటిని తిప్పి కొడతాం.*

Search
Categories
Read More
SURAKSHA
Tamil Nadu Police Green Drive Plants Thousands of Trees Every Year
Tamil Nadu Police contributes to environment through tree plantation drives. Officers and...
By Kalaga Sailaja 2026-07-02 08:20:04 0 56
Andhra Pradesh
ఎమ్మిగనూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో
జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఎమ్మిగనూరు నియోజకవర్గం సమన్వయకర్త ఎర్రకోట...
By Boya Dasthagiri 2026-04-11 09:17:24 0 174
Telangana
ADB: రిమ్స్ లో బాలింత మృతి.. ఏడుగురిపై చర్యలు
రిమ్స్లో ఉట్నూర్ మండలం పిట్లగూడకు ఆదివాసీ మహిళ గంగశీల మృతి ఘటనలో ఏడుగురు సిబ్బందిపై జిల్లా...
By Mitappaly Shiavji 2026-01-01 04:00:48 0 614
Andhra Pradesh
పుంగనూరు: కల్తీ ఎరువులతో రైతుల ధర్నా
అన్నమయ్య జిల్లా, సోమల మండల కేంద్రంలో మంగళవారం పలువురు రైతులు ధర్నా నిర్వహించారు. టమాటా సాగు కోసం...
By Kothuru Murali 2026-05-26 11:35:24 0 72
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై శివనామస్మరణ వైభవంగా
పత్రికా ప్రకటన    ఇంద్రకీలాద్రిపై శివనామ స్మరణం - వైభవంగా శ్రీ మల్లేశ్వరస్వామి వారి...
By Rajini Kumari 2026-02-16 07:33:41 0 202
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com