వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మల్లంపల్లి హై స్కూల్ విద్యార్థిని కావ్యశ్రీ కి ట్రిపుల్ఐటీ బాసరలో సీటు.....!

0
161

మల్లంపల్లి హై స్కూల్ విద్యార్థిని కావ్యశ్రీకి ట్రిపుల్ఎటీ బాసరలో సీటు.

 

భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం జూన్ 1 రోజున దుగ్గొండి మండలం మల్లంపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని జనగాం కావ్యశ్రీకు ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటి విద్యాలయంలో సీటు వరించింది. ఇటీవల విడుదలైన పదోతరగతి పరీక్షలలో ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్ లలో జిల్లా టాపర్ గా కావ్యశ్రీ నిలిచింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ట్రిపుల్ ఐటి). ఇది భారతదేశంలో సాంకేతిక విద్యను అందించే ప్రతిష్టాత్మకమైన జాతీయ విద్యాసంస్థల సమూహం.రాజివ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ కళాశాల. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా, బాసర పట్టణంలో ఉన్న ఒక ప్రతిష్టాత్మక ప్రభుత్వ విశ్వవిద్యాలయం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.చిన్నారి కార్యశ్రీకి ప్రతిష్టాత్మక ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో సీటు రావడం పట్ల తాతయ్య అమ్మమ్మ మల్లంపల్లి మాజీ సర్పంచ్ తడుక సువర్ణ కొమురయ్య గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. తమ పాఠశాల విద్యార్థిని జనగాం కావ్యశ్రీ పదోతరగతి పరీక్షలో జిల్లా టాపర్ గా నిలిచి మల్లంపల్లి పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిందని అన్నారు.నేడు బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో సీటు సాధించడం గర్వకారణం అని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భార్గవి అన్నారు.ఈ సందర్భంగా కావ్యశ్రీని అభినందించారు..

కావ్యశ్రీకి ప్రశంసల వెల్లువ..ఎస్ఎస్సి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి జిల్లా టాపర్ గా నిలిచి బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో సీటు సాధించిన జనగాం కావ్యశ్రీకి అభినందనలు వెల్లువెత్తాయి.ప్రత్యక్షంగా పలువురు నాయకులు, అధికారులు, గ్రామస్తులు అభినందనలు తెలుపగా కొందరు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన జనగాం కావ్యశ్రీ భవిష్యత్ లో ఉన్నత శిఖరాలను అధిగమించాలని పలువురు కోరారు.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Search
Categories
Read More
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ కష్టాలు
*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*   *ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ట్రాఫిక్ ట్రాఫిక్ డిసిపి...
By Rajini Kumari 2026-01-18 14:15:21 0 189
Telangana
బిజెపి రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ పత్రాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్ రావు
 బిజెపి రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించి నామినేషన్ పత్రాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్సీ శ్రీ...
By Sidhu Maroju 2025-06-30 16:48:09 0 1K
Andhra Pradesh
గుంటూరు వెస్ట్ డీస్పీ శ్రీ కె. అరవింద్ గారు విద్యార్థులకు మాదగద్రవ్యాల అవగాహన సదస్సు సంకల్పం కార్యక్రమం చేసినారు. గుంటూరు జిల్లా ఎస్పీ మరియు ఐజి ఆదేశాల మేరకు.
గుంటూరు జిల్లా పోలీస్...* *పట్టాభిపురం పోలీస్ స్టేషన్* *తేది: 31.12.2025* _*//“డ్రగ్స్...
By KOTESWARARAO KVSR 2025-12-31 12:18:11 0 736
Andhra Pradesh
Kalva Srinivasulu: సభకు రాకపోవడం ప్రజలను అవమానించడమే: వైసీపీపై ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఫైర్.
శాసనసభ చర్చలకు దూరంగా ఉండటం అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవమానించడమేనని ప్రభుత్వ విప్ కాల్వ...
By Pagadala Venkateswar 2026-02-10 09:37:11 0 156
Telangana
శాంతి శ్రీనివాస్ రెడ్డి చొరవ - చినరాయుని చెరువుకు గుర్రపు డెక్క విముక్తి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని చినరాయుని చెరువు ప్రక్షాళనకు ఎట్టకేలకు...
By Sidhu Maroju 2026-02-05 10:15:08 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com