పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.

0
106

 

పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

30-05-2026 Sat 08:29 | Andhra

Pawan Kalyan Orders Alert on Tiger Movement in Polavaram

పులి దాడిలో 9 దూడలు మృతి చెందడంపై అధికారుల అప్రమత్తం

పులిని బంధించాలని అటవీ శాఖకు డిప్యూటీ సీఎం ఆదేశం

అధునాతన టెక్నాలజీతో 24 గంటల పర్యవేక్షణకు ఏర్పాట్లు

నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందించాలని సూచన

పోలవరం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలు, పశువుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పులి కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.

 

ఇటీవల పోలవరం జిల్లాలోని చికిలింత పంచాయతీలో పులి దాడి చేసి 9 దూడలను చంపిన ఘటనపై పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పులి తిమ్మాపురం రిజర్వ్ ఫారెస్ట్‌‌లో సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీనిపై సమీక్ష నిర్వహించిన ఆయన, పులి వల్ల మనుషులకు, పశువులకు ఎలాంటి హాని జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

 

పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు డ్రోన్లు, ట్రాప్ కెమెరాల వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని పవన్ సూచించారు. 24 గంటల పాటు నిఘా కోసం ప్రత్యేక 'హనుమాన్' బృందాలను రంగంలోకి దించాలని, అవసరమైతే వాటి సంఖ్యను పెంచాలని అన్నారు. పులిని సురక్షితంగా బంధించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) స్థాయి అధికారి ఈ ఆపరేషన్‌ను స్వయంగా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

 

అదే సమయంలో, పశువులను కోల్పోయిన రైతులకు తక్షణమే మధ్యంతర పరిహారం అందించినట్లు, పూర్తి నష్టపరిహారాన్ని త్వరలో చెల్లిస్తామని అధికారులు పవన్‌కు వివరించారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలని కూడా ఆయన ఆదేశించారు.

Search
Categories
Read More
Telangana
గంజాయి తీసుకుంటూ దొరికిన MLA కుమారుడు
TG: ఈగల్ టీమ్ తనిఖీల్లో ఎమ్మెల్యే కుమారుడు పట్టుబడ్డారు. నానక్రామ్గూడలో నిర్వహించిన తనిఖీల్లో ఏపీ...
By Mitappaly Shiavji 2026-01-03 10:57:31 0 600
Andhra Pradesh
గ్రూప్-2 ఫలితాలలో విజయం సాధించిన మన ఆళ్లగడ్డ కీర్తిని రాష్ట్ర స్థాయిలో చాటిన నలుగురు అభ్యర్థులు
గ్రూప్-2 ఫలితాల్లో విజయం సాధించి, మన ఆళ్లగడ్డ కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటిన నలుగురు అభ్యర్థులకు...
By Chennaiah Kati 2026-02-04 08:30:23 0 232
Andhra Pradesh
ఎమ్మిగనూరు తాసిల్దార్ గారికి వినతి పత్రం అందజేసిన బిజెపి జిల్లా అధికార ప్రతినిధి గుర్రాజ్ దేశాయ్
  శ్రీ గురురాజ్ దేశాయ్  మరియు బిజెపి నాయకులు ప్రముఖ న్యాయవాది శ్రీ ఉరుకుందు గారు వినతి...
By Boya Dasthagiri 2026-03-31 11:32:36 0 209
Telangana
తెలంగాణ రాష్ట్రంలో మరో నూతన పార్టీ
 తెలంగాణలో నూతనంగా ప్రారంభించబోయే రాజకీయ పార్టీ కల్వకుంట్ల కవిత ఏర్పాటుచేసిన ...
By Thalakokkula Sadanandam 2026-04-25 08:11:48 0 434
Andhra Pradesh
ఏపీ కొత్త జిల్లాల ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదం
 ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది....
By John Baji 2025-12-29 09:19:48 0 158
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com