గుడివాడలో టిడిపి మహానాడు గ్రాండ్ సక్సెస్

0
83

*గుడివాడలో టిడిపి హైబ్రిడ్ మహానాడు గ్రాండ్ సక్సెస్...*

 

*10 క్లస్టర్లలో ఉత్సాహంగా పాల్గొన్న పార్టీ శ్రేణులు*

 

*రెండు రోజుల మహానాడులో....17,323మంది కార్యకర్తల ఆన్లైన్ అటెండెన్స్....సాధారణ ప్రజానికం అదనం*

 

*ఐఎంఏ హాల్లో ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము....*

 

*రెండు రోజుల మహానాడును విజయవంతం చేసిన నాయకత్వానికి అభినందనలు*

 

*కొడాలి నాని కోరలు పీకిన పాము.. ప్రజల్లోకి రా తేల్చుకుందాం...ఎమ్మెల్యే రాము సవాల్*

 

*గత పాలకుల మాదిరి అరాచకాలు, కబ్జాలు చెయ్యట్లేదు.. గుడివాడ అభివృద్ధే నా లక్ష్యం" - ఎమ్మెల్యే రాము*

 

గుడివాడ:గుడివాడ నియోజకవర్గంలో టిడిపి హైబ్రిడ్ మహానాడు విజయవంతంగా ముగిసింది. పది క్లస్టర్లలో నిర్వహించిన మహానాడులో టిడిపి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 

 

గుడివాడ సత్యనారాయణపురంలోని ఐఎంఏ హాల్లో జరిగిన ముగింపు వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరిగిన మహానాడు విజయవంతం చేసిన పార్టీ నాయకత్వాన్ని ఆయన అభినందించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ... చంద్రబాబు చెప్పినట్లు క్లస్టర్ స్థాయిలో కొత్తగా బాధ్యతలు ఇస్తారని, సమష్టి కృషితో విజయం సాధించామని, ఈ స్ఫూర్తిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. మహానాడులో చంద్రబాబు, లోకేష్, పార్టీ పెద్దలు చెప్పిన మాటలను ఆచరిస్తామని చెప్పారు.రెండు రోజుల మహానాడులో.... నియోజకవర్గ వ్యాప్తంగా 17,323మంది సభ్యత్వ కార్డులు కలిగిన కార్యకర్తల ఆన్లైన్ అటెండెన్స్ నమోదయిందని....సాధారణ ప్రజానికం హాజరు అదనమని ఎమ్మెల్యే రాము తెలిపారు.

 

 

కొడాలి నానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్యే రాము..పనికి మాలిన కొడాలి నాని మళ్లీ వచ్చాడనీ, ఈపాటికి జైలుకు వెళ్లసిందనీ,రోగంతో ఉన్నాడని చూసి చూడనట్లు పట్టించుకోక పోతే ఇప్పుడు పిచ్చివాగుడు లాగుతున్నాడనీ మండిపడ్డారు. చంద్రబాబు స్థాయి గురించి మాట్లాడే అర్హతగా ఉందా? వాడు కోరలు పీకిన పాము అని విమర్శించారు.

 

గత పాలకుల మాదిరి మనం అరాచకాలు, కబ్జాలు చెయ్యట్లేదనీ,జూద క్రీడలను ప్రోత్సహించడం లేదనీ, ప్రజలకు మంచి చెయ్యడం, గుడివాడ అభివృద్ధి నా లక్ష్యమని పేర్కొన్నారు.మనం చేస్తున్న అభివృద్ధి పవర్ ఫుల్ వెపన్ అని రానున్న రోజుల్లో ఎన్నో అభివృద్ధి పనులను ప్రజలకు చూపిస్తాను" అని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు.

 

గుడివాడ శుభ్రతకు చేపట్టిన ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం కూడా అభినందించిందన్నారు.,సాంకేతికంగా పార్టీ యాప్‌ల ద్వారా చంద్రబాబు, లోకేష్, తనతో మాట్లాడవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య,సీనియర్ నాయకులు లింగం, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు నేరుసు కాశి,పార్టీ నాయకులు యార్లగడ్డ సుధారాణి, షేక్ జానీ,పొట్లూరి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Himachal Pradesh
Healthcare Infrastructure and Public Health Expansion
Himachal Pradesh is enhancing its healthcare system through the expansion of medical...
By Fathima Safa 2026-06-22 11:18:14 0 172
Andhra Pradesh
ఏపీలో కొత్త పింఛన్లు.. జూన్ 1 నుంచి వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ.
ఏపీలో కొత్త పింఛన్లు.. జూన్ 1 నుంచి వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ 15-05-2026 Fri 08:14 |...
By Pagadala Venkateswar 2026-05-15 06:15:49 0 91
Telangana
ఇంధన కొరత వార్తలు అవాస్తవం : తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టత.|
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంధన కొరత (Fuel Shortage) ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని...
By Sidhu Maroju 2026-03-25 06:46:00 0 173
Ladakh
Ladakh Launches Nature Guide Training for Border Youth
In a major boost for eco-tourism and wildlife preservation, the Ladakh administration has...
By Lokeshwari Panthadi 2026-06-26 10:18:45 0 54
Business & Finance
Grow Faster with Public Limited Company Registration
Registering a Public Limited Company is the ideal choice for businesses planning large-scale...
By Navya Sree 2026-07-08 07:17:25 0 52
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com