స్వాతంత్ర్యం వచ్చాక ఇదే తొలిసారి: కూటమి ప్రభుత్వంపై మహానాడులో ట్రాన్స్‌జెండర్ వర్షిణి ప్రశంసలు.

0
45

కూటమి ప్రభుత్వం తమ జీవితాల్లో వెలుగులు నింపిందని వ్యాఖ్య

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి పీఏగా వర్షిణి నియామకం

ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు గొప్ప ఆలోచన అన్న వర్షిణి

తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి వ్యక్తిగత సహాయకురాలిగా (పీఏ) పనిచేస్తున్న ట్రాన్స్‌జెండర్ వర్షిణి, కూటమి ప్రభుత్వం తమ జీవితాల్లో వెలుగులు నింపుతోందని చెబుతూ భావోద్వేగంగా ప్రసంగించారు. ఆమె మాటలు సభకు హాజరైన వారిని ఆకట్టుకున్నాయి.

 

మంగళగిరిలో జరుగుతున్న మహానాడులో వర్షిణి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ట్రాన్స్‌ జెండర్ల సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రశంసించారు. "స్వాతంత్య్రం వచ్చాక ఏ ప్రభుత్వమూ, ఏ రాజకీయ నాయకులు చేయని ఆలోచనలు కూటమి ప్రభుత్వంలో చేసి ట్రాన్స్‌ జెండర్ల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు," అని ఆమె పేర్కొంది. గతంలో ఏ ప్రభుత్వం తమను పట్టించుకోలేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం తమకు గౌరవం కల్పిస్తోందని ఆమె అన్నారు. ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అందులో ట్రన్స్ జెండర్ ను నియమించడం ఎవరికీ సాధ్యం కాని గొప్ప ఆలోచనగా ప్రశంసించింది.

 

ఒక ట్రాన్స్‌ జెండర్‌ను ఎమ్మెల్యేకు పీఏగా నియమించడం, ఇప్పుడు పార్టీ ప్రధాన సభ అయిన మహానాడులో మాట్లాడే అవకాశం ఇవ్వడం తమ వర్గానికి దక్కిన గొప్ప గౌరవంగా వర్షిణి అభివర్ణించారు. ఇది తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని, ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.

Search
Categories
Read More
Karnataka
Bengaluru Sees Sharp Rise in Human Rights Complaints
Banagalore- Karnataka - In the last two years, Bengaluru Urban has recorded a staggering 3,537...
By Citizen Rights Council 2025-08-11 10:43:05 0 2K
Telangana
కాట్రియాల-పర్వతపూర్ రోడ్డు కంకరమయం
రామాయంపేట మండలం కాట్రియాల గ్రామం నుంచి పర్వతాపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా...
By Katiyala JeevanRaj 2026-03-14 10:00:20 0 371
Telangana
ఆత్మహత్య ఒక సామాజిక సమస్య
హైదరాబాద్ : నేడు ఆత్మహత్యల నివారణ దినోత్సవం (World Suicide Prevention Day)  దీని నివారణకు...
By Sidhu Maroju 2025-09-10 13:23:30 0 279
Andhra Pradesh
పుంగనూరు: పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న కలెక్టర్
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, గొంగివారిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ...
By Kothuru Murali 2026-03-01 12:38:16 0 98
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com