"లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ శామీర్‌పేట్ తహసీల్దార్ సుచరిత”|

0
146

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది.

 ఈ కేసులో శామీర్‌పేట్ ఎంఆర్ఓ (తహసీల్దార్)సుచరిత  పై అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం, రూ.2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

భూ కన్వర్షన్‌కు సంబంధించిన ఫైల్‌ను ముందుకు జరిపేందుకు ఈ లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో ట్రాప్ నిర్వహించి, డబ్బులు స్వీకరిస్తున్న సమయంలోనే పట్టుకున్నారని సమాచారం.

దాడుల అనంతరం అధికారులు తహసీల్దార్ కార్యాలయం మరియు సంబంధిత వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేపట్టారు.

ఈ సందర్భంగా సుమారు 30 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు బయటపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటి విలువ కోట్ల రూపాయల్లో ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఇంకా ఒక లక్ష రూపాయలు అదనంగా తీసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారని, ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోందని తెలుస్తోంది.

ప్రస్తుతం అధికారులు పలు డాక్యుమెంట్లు, ఆస్తుల వివరాలు, బ్యాంక్ లావాదేవీలు పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: రోడ్డు భద్రతా నియమాలు పాటిద్దాం: ఆర్టీఓ.
మదనపల్లిలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా, ఆర్టీఓ అశోక్ ప్రతాప్‌రావ్ స్థానిక...
By Pagadala Venkateswar 2026-01-23 11:24:40 0 160
Andhra Pradesh
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో లూధరన్ ప్రార్థనా మందిరం పెయింటింగ్ కు 25వేల విరాళం
*లూథరన్ ప్రార్థన మందిరం పెయింటింగ్‌కు రూ.25 వేల విరాళం*   *ఐటీ విద్యా శాఖ మంత్రి నారా...
By Rajini Kumari 2025-12-17 08:42:02 0 215
Telangana
"గోల్కొండ అమ్మవారికి బోనం ఎత్తిన ఈటల రాజేందర్".|
"బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.. వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక వేడుక:...
By Sidhu Maroju 2026-07-16 08:03:10 0 59
Andhra Pradesh
పుంగనూరు: ఈ బోడెద్దుల విలువ ఎంతో తెలుసా...
పుంగనూరు ఎద్దుల పరుషలో రూ. 5,50,000 విలువైన జోడెద్దులు అందరి దృష్టిని ఆకర్షించాయి. సత్యసాయి...
By Kothuru Murali 2026-05-07 12:16:19 0 108
Andaman & Nikobar Islands
Congress Leader Demands Withdrawal of Draft Tribal Council Election Rules 2026
Shri TSG Bhasker, Campaign Committee Chairman for the Andaman & Nicobar Territorial Congress...
By Tejaswini Komanduru 2026-06-05 09:16:06 0 680
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com