"లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ శామీర్‌పేట్ తహసీల్దార్ సుచరిత”|

0
148

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది.

 ఈ కేసులో శామీర్‌పేట్ ఎంఆర్ఓ (తహసీల్దార్)సుచరిత  పై అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం, రూ.2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

భూ కన్వర్షన్‌కు సంబంధించిన ఫైల్‌ను ముందుకు జరిపేందుకు ఈ లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్‌తో ట్రాప్ నిర్వహించి, డబ్బులు స్వీకరిస్తున్న సమయంలోనే పట్టుకున్నారని సమాచారం.

దాడుల అనంతరం అధికారులు తహసీల్దార్ కార్యాలయం మరియు సంబంధిత వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేపట్టారు.

ఈ సందర్భంగా సుమారు 30 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు బయటపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటి విలువ కోట్ల రూపాయల్లో ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఇంకా ఒక లక్ష రూపాయలు అదనంగా తీసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారని, ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోందని తెలుస్తోంది.

ప్రస్తుతం అధికారులు పలు డాక్యుమెంట్లు, ఆస్తుల వివరాలు, బ్యాంక్ లావాదేవీలు పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

#Sidhumaroju

Search
Categories
Read More
Telangana
SI's charity for children who lost their mother!
MAHABUBABAD/KOTHAGUDA::Manemma, a resident of Kothaguda Mandal Center, recently passed away due...
By Bheeshman King 2026-07-03 07:55:18 0 281
Andhra Pradesh
ఆర్ ఎం ఎస్ ర్యాంకును సాధించిన మురళి యూపీ స్కూల్ విద్యార్థిని అభినందించిన సుగవాసి ప్రసాద్ బాబు
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మురళి యూపీ స్కూల్ విద్యార్థి పని రామ వర్మ రాష్ట్రీయ మిలిటరీ...
By Benguluri Madhubabu 2026-03-16 13:11:30 0 242
Andhra Pradesh
“Section 30 of the Police Act to be in force across Vikarabad District till February 28” – District SP Smt. Sneha Mehra, IPS
Keeping in view the maintenance of law and order in Vikarabad District, District Superintendent...
By Terli Ashok 2026-02-04 11:21:08 0 826
Telangana
ప్రజా సమస్యలపై మాజీ కార్పొరేటర్ దూకుడు.. కమిషనర్‌కు వినతిపత్రం.|
మల్కాజ్‌గిరి:  మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి  మల్కాజ్‌గిరి కమిషనర్...
By Sidhu Maroju 2026-04-09 09:51:10 0 559
Business & Finance
Bengaluru Hosts Major Business Awards Event 2026
The Times Business Awards 2026 was held in Bengaluru, bringing together industry leaders,...
By Navya Sree 2026-07-01 13:38:52 0 98
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com